Gaza: గాజాలో తీవ్ర దుర్భిక్షం.. ఆహారం కోసం ప్రజలు అవస్థలు
- ఉత్తర గాజాలో తీవ్ర దుర్భిక్షం
- ఆహారం కోసం ప్రజలు అవస్థలు
- ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్న డబ్ల్యూఎఫ్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి ఏ నొప్పినైనా భరించగలడు గానీ ఆకలి బాధను భరించలేడు. ఉదయం కొంచెం లేటుగా టిఫిన్ చేస్తేనే నీరస పడిపోతారు. స్పృహ తప్పి పడిపోతారు. అలాంటిది కొద్ది నెలలుగా గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు తిండి లేక నీరసించిపోతున్నారు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కూడా వదులుతున్నారు. తాజాగా ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
గతేడాది అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా గాజాపై భీకర యుద్ధం సాగించింది. మొత్తం గాజాను నేలమట్టం చేసింది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. అప్పటి నుంచి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కొన్ని స్వచ్చంధ సంస్థలు ఆహార పంపిణీ చేసినా కొరత మాత్రం తీరలేదు. దీంతో అర్థాకలితోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతున్నారు.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
ఇదిలా ఉంటే ఈ పరిస్థితి అక్టోబర్లో మరింత తీవ్రంగా మారింది. ఈనెల ప్రారంభం నుంచి ఉత్తర గాజాలోకి ఎటువంటి ఆహారం ప్రవేశించలేదు. దీంతో తిండి దొరకకా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం నేతలు (WFP) చెబుతున్నారు. ఆగస్ట్లో దాదాపు 700 సహాయ ట్రక్కులు ఉత్తర గాజాకు చేరుకున్నాయి. అయితే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మరియు జోర్డాన్ మధ్య అలెన్బై క్రాసింగ్లో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత సెప్టెంబరులో 400 ట్రక్కులు మాత్రమే వచ్చాయి. ఇక అక్టోబర్లో అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫుడ్ ట్రక్కులు ప్రవేశించలేదని డబ్ల్యూఎఫ్పీ పేర్కొంది. గాజాలో ఆకలి బలంగా ఉందని.. కరవు ముప్పు మరింత కొనసాగుతుందని తెలిపింది. తక్షణమే సహాయ కార్యక్రమాలు కొనసాగకపోతే ఒక మిలియన్ ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిపింది.
హమాస్ మళ్లీ తన కార్యక్రమాలు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ అక్టోబర్ 6 నుంచి ఉత్తర గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే ప్రజలు ఇళ్లులు ఖాళీ చేయడం లేదు. ఇంకోవైపు హమాస్ మిలిటెంట్లు నివాసాలనే సేఫ్ జోన్లుగా ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హమాస్ను అంతమొందించే కార్యక్రమంలో భాగంలో దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఆహార పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!