Elon Musk: హమాస్ ఉగ్రవాదుల్ని చంపడం తప్ప వేరే మార్గం లేదు.. మస్క్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లో ఎలాన్ మస్క్ భేటీ అయిన సందర్భంలో ఈయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16,000 మందికి పైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో హమాస్ ఉగ్రవాదులను హతమార్చడం తప్ప వేరే మార్గం లేదని ఎలాన్ మస్క్ అన్నారు.
కొత్త తరం ప్రజలు ‘‘ హంతకులుగా శిక్షణ పొందకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ప్రజలలో శ్రేయస్సును నిర్మించాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘ నేను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూతో ఇప్పుడే మాట్లాడాను. గాజా పరిస్థితిలో మూడు విషయాలు జరగాలి. పౌరులను హత్య చేయాలనే పట్టుబట్టే వారిని చంపడం తప్ప వేరే మార్గం లేదు. వారు తమ మనసును మార్చుకోరు’’ అని మస్క్ ఇజ్రాయిల్ అధ్యక్షుడితో అన్నారు. రెండో విషయం ఏంటంటే.. కొత్త తరం ప్రజలు హంతకులుగా మారకుండా ప్రజల మధ్య శ్రేయస్సును నిర్మించడం ముఖ్యమని ఆయన అన్నారు.
Also Read
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
Read Also: Soma Bharat: కాంగ్రెస్ ఏకే గోయల్కు క్షమాపణ చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కిబ్బట్జ్ క్ఫర్ అజా పర్యటన గురించి మాట్లాడుతూ.. తమ దగ్గరి, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు మానసికంగా కష్టతరమైన రోజు అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో భేటీ సందర్భంగా హమాస్ చేతిలో ఉన్న బందీల కుటుంబాలతో మస్క్ సమావేశమయ్యారు. బందీల తండ్రి అతనికి సింబాలిక్ డాగ్ ట్యాగ్ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై ‘ మా హృదయాలు గాజాలో బందీలుగా ఉన్నాయి’ అని ఉంది. గాజాలోని బందీలు విడుదలయ్యే వరకు ఈ ట్యాగ్ ప్రతీ రోజు ధరిస్తానని మస్క్ చెప్పారు.
ఇదిలా ఉంటే నాలుగు రోజుల సంధిలో భాగంగా ఇజ్రాయిల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అందుకు ప్రతిగా హమాస్ 59 మంది బందీలను విడుదల చేసింది. సంధిని మరో రెండు రోజపులు పొడగించుకోవాలని ఇరుపక్షాలు ఖైదీలను, బందీలను మార్చుకోవాలని భావిస్తున్నాయి. సోమవారం ఇజ్రాయిల్, ఎలాన్ మస్క్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ ఆమోదంతో గాజాలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్పేస్ ఎక్స్ అందిస్తుంది.
తాజావార్తలు
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!