Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- సౌదీకి ట్రంప్ షాక్!
- హౌతీలతో రహస్య భేటీ
- సైనిక సాయం చేసే విషయంలో దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. తాజాగా ఈ దాడులు మక్కాకు కూడా చేరాయి. సాయం చేయాల్సిన పాకిస్థాన్ సైడ్ అయిపోయింది. దీంతో అమెరికా సాయం కోరితే అందుకు ట్రంప్ కూడా నిరాకరించినట్లుగా వార్తలు వచ్చాయి. లేటెస్ట్గా మరో బ్రేకింగ్ వార్త వచ్చింది. హౌతీల దాడులను ఎదుర్కొనేందుకు సైనిక సహాయం కోరిన సౌదీ అరేబియాకు నేరుగా మద్దతు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. దీనికి కొద్ది రోజుల ముందు అమెరికా అధికారులు యెమెన్లోని ఇరాన్ మద్దతుగల హౌతీ ప్రతినిధులతో ఒమన్లో రహస్యంగా సమావేశమైనట్లు ఐదుగురు వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.
రహస్య భేటీ
ఒమన్ రాజధాని మస్కట్లోని అమెరికా రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు మూడు వర్గాలు వెల్లడించాయి. ప్రాంతీయ వివాదాల్లో మధ్యవర్తిత్వం చేస్తూ వస్తున్న ఒమన్ ఈ చర్చలకు సహకరించినట్లు మరో ఇద్దరు వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. యెమెన్లో హౌతీలు వేగంగా ముందుకు సాగుతూ వ్యూహాత్మకమైన ఎర్ర సముద్ర తీర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు సౌదీ మద్దతున్న బలగాలను వెనక్కి నెట్టిన కొన్ని రోజులకే ఈ చర్చలు జరిగినట్లు సమాచారం.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
సైనిక సాయం కోరిన సౌదీ
హౌతీల దాడిని అడ్డుకునేందుకు సైనిక సహాయం అందించాలని అమెరికాను సౌదీ అరేబియా కోరినట్లు రాయిటర్స్ తెలిపింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్, దేశ పాలకుడు మహ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడి సైనిక సహాయం కోరినట్లు సమాచారం. అయితే అనంతరం సౌదీకి అమెరికా నేరుగా సైనిక జోక్యం చేసుకోబోదని వాషింగ్టన్ స్పష్టం చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. అమెరికా ప్రభుత్వం 2025 మార్చిలో హౌతీ ఉద్యమాన్ని ‘ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్’గా ప్రకటించింది. ఆ సంస్థకు మద్దతు ఇవ్వడాన్ని అమెరికా చట్టపరంగా నేరంగా పరిగణిస్తోంది. అయినప్పటికీ హౌతీలతో అమెరికా ప్రత్యక్షంగా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. 2025లో ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను అడ్డుకునేందుకు అమెరికా రెండు నెలల పాటు వైమానిక దాడులు నిర్వహించింది. అనంతరం మే 2025లో ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది.
హౌతీలు హామీ!
తాజా సమావేశంలో 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందని హౌతీలు అమెరికా అధికారులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తమకు లేదని కూడా చెప్పినట్లు రెండు వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ నౌకలు, వాణిజ్య నౌకలపై కూడా దాడులు చేయబోమని హౌతీలు తెలిపినట్లు సమాచారం. అయితే సౌదీకి అనుబంధమైన నౌకలకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. యెమెన్పై సౌదీ విధించిన దిగ్బంధనం కారణంగా సౌదీకి అనుబంధమైన నౌకలను మాత్రమే లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు ఓ యెమెన్ వర్గం తెలిపింది.
హౌతీలు తమను సంప్రదించి యెమెన్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని కోరారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా సోమవారం హౌతీలతో అమెరికా నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ధృవీకరించారు. అయితే చర్చలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు. తాజా సమావేశం ఆదివారం జరిగినట్లు ఓ వర్గం తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయంలోని సిబ్బందే చర్చల్లో పాల్గొన్నట్లు మరో రెండు వర్గాలు పేర్కొన్నాయి. హౌతీలతో ఈ రహస్య చర్చల అనంతరమే యెమెన్లో హౌతీల పురోగతిని అడ్డుకునేందుకు సౌదీ అరేబియాకు నేరుగా సైనిక సహాయం అందించకూడదనే అమెరికా నిర్ణయం వెలువడినట్లు సమాచారం. దీంతో హౌతీలు, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!