Netanyahu: గాజాపై యుద్ధం ముగియలేదు.. హమాస్ పాలన అంతమే లక్ష్యమన్న నెతన్యాహు
- గాజాపై యుద్ధం ముగియలేదు
- హమాస్ పాలన అంతమే లక్ష్యమన్న నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాపై ఇంకా యుద్ధం ముగియలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా స్పీకర్తో సమావేశం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విలేకరులతో మాట్లాడారు. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యా్న్ని ఇజ్రాయెల్ పూర్తి చేస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Flipkart GOAT Sale: ఫ్లిప్కార్ట్ GOAT సేల్ ప్రారంభం.. iPad, టాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. లిస్ట్ ఇదిగో..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందమే కుదిరిందని.. కానీ హమాస్ ప్రభుత్వాన్ని అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని తేల్చి చెప్పారు. గాజాలో హమాస్ సైనిక, పాలనా సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని వెల్లడించారు. పాలనకు హమాస్ ముగింపు పలికితేనే సమస్యకు పరిష్కారం అని.. అంతే తప్ప 60 రోజుల కాల్పుల విరమణ శాంతికి మార్గం కాదని స్పష్టం చేశారు. ఇక ఇరాన్పై చారిత్రాత్మక విజయం తర్వాత వాషింగ్టన్లో చారిత్రక పర్యటన జరిగిందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇక హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బాధిత కుటుంబాలకు నెతన్యాహు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Shubhanshu shukla: భూమి మీదకు శుభాన్షు శుక్లా తిరిగి రావడం వాయిదా.. ఆరోజే వచ్చేది..!
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి పలువురిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ నాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇప్పటికే గాజాను నాశనం చేసింది. అయితే ఇటీవల ట్రంప్.. హమాస్-ఇజ్రాయెల్ 60 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే గడువులోగా తమ డిమాండ్లు నెరవేరకపోతే తిరిగి దాడులు చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..