Pakistan: నేను అధికారంలో ఉంటే జీ20ని నిర్వహించే వాడ్ని.. నవాజ్ నీకు అంత సీనుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్ జీ20 సదస్సును నిర్వహించిన తీరు పాకిస్తాన్కి ముఖ్యంగా అక్కడి రాజకీయ పార్టీలు, సైన్యానికి అసూయను కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రవాసంలో ఉన్న పాకిస్తాన్ పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జీ20 సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తానను పదవీ నుంచి దించేయకుంటే భారత్ జీ20కి ఆతిథ్యం ఇచ్చిన విధంగా పాకిస్తాన్ కూడా అలాంటి సమావేశాలను నిర్వహించేదని వ్యాఖ్యానించారు.
Read Also: North Korea: రష్యా పర్యటనలో కిమ్.. క్షిపణుల ప్రయోగంలో నార్త్ కొరియా
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2017లో తనను పదవి నుంచి దించేయకుంటే దేశ భవిష్యత్తు మరో విధంగా ఉండేదని లండన్ లో ప్రవాసంలో గడుపుతున్న నవాజ్ షరీఫ్ అన్నారు. వరసగా మూడు సార్లు పాక్ ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ పేరు పనామా పేపర్స్ లీక్ లో రావడంలో ఆయన్ను ప్రధానిగా సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో 2018 జీవితకాలం ప్రభుత్వ పదవిని నిర్వహించడానికి అనర్హుడయ్యాడు. 2019లో చికిత్స కోసం లండన్ వెళ్లిన నవాజ్ అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. 2019లో ఆయనకు అల్-అజీజియా కేసులో 7 ఏళ్ల జైలు శిక్షను లాహోర్ కోర్టు విధించింది.
ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానంతో గద్దె దించిన తర్వాత నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యాడు. దీంతో పాకిస్తాన్ లో పరిస్థితులు మారిపోయాయి. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ వచ్చి మరోసారి ప్రధాని కావాలనే ఆసక్తితో ఉన్నారు. దీనికి సైన్యం మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ పార్టీ విజయం సాధిస్తే తన అన్న నవాజ్ షరీఫ్ ప్రధాని అవుతారని షెహబాజ్ అంటున్నారు. దేశాన్ని అణుసామర్థ్యం వైపు తీసుకెళ్లిన ఘటన నవాజ్ షరీఫ్ దే అని, అతను పాకిస్తాన్ వస్తే ఘనంగా స్వాగతిస్తామని షహబాజ్ చెబుతున్నారు. జీవితకాల అనర్హత చట్టాన్ని పార్లమెంట్ ఇటీవల మార్చింది. దీంతో నవాజ్ షరీఫ్ పునారగమనం సులువైంది. అక్టోబర్ 21న స్వదేశం పాకిస్తాన్ వచ్చేందుకు పెద్ద షరీఫ్ సిద్దమయ్యారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!