భూ ప్రకంపనలు సర్వ సాధారణం.. ఎప్పుడూ ఏదో ఓ చోట అవి సంభవిస్తూనే ఉంటాయి.. ఎక్కువ సార్లు వాటి తీవ్రత చాలా తక్కువగా ఉన్నా.. కొన్నిసార్లు మాత్రం వాటి తీవ్ర ఎక్కువగా ఉంటుంది.. భారీ నష్టాన్ని కూడా చవిచూసిన సందర్భాలు ఎన్నో.. అయితే, ఈ మధ్య తరుచూ అంగాకర గ్రహంపై ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. దీనిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ మార్స్ గ్రహం గుర్తించింది.. ఇప్పటి వరకు మార్స్పై సంభవించిన అతిపెద్ద, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్సైట్ గుర్తించినట్లు చెబుతోంది నాసా.. ఈసారి దాని తీవ్రత 4.2గా నమోదు అయినట్టు వెల్లడించింది.. అంతేకాదు.. ఏకంగా గంటన్నర పాటు ప్రకంపనలు నమోదు అయ్యాయయి.. ఈ నెల 18వ తేదీన అంగారకుడిపై ఈ అతిపెద్ద, సుదీర్ఘ భూకంపం సంభవించినట్టు నాసా తెలిపింది. కాగా, అంగారకుడిపై ఈ మధ్య తరచూ ప్రకంపనలు వస్తున్నాయి.. నెల రోజుల వ్యవధిలోనే మూడోసారి ప్రకంపనలు రావడం ఇదేతొలిసారి.
కాగా, ఇన్సైట్ ల్యాండర్, దాని చెవులను మార్టిన్ గ్రౌండ్కి అమర్చారు, ఉపరితలం కింద కొన్ని పెద్ద గర్జనలను విన్నారు.. దాదాపు గంటన్నరపాటు ఇవి కొనసాగాయని.. 4.2 తీవ్రతతో అంగారకుడిపై అతిపెద్ద మరియు సుదీర్ఘకాలం కొనసాగే భూకంపంగా చెబతోంది నాసా.. సెప్టెంబర్ 18న సంభవించిన ఈ భూకంపం కేవలం ఒక నెలలో ల్యాండర్ రికార్డ్ చేసిన మూడవ అతిపెద్ద ఘటన. ఇన్సైట్ ఆగస్టు 25 న రెండు భూకంపాలను 4.2 మరియు 4.1గా గుర్తించింది. సెప్టెంబర్ 18 న 4.2 భూకంపం మిషన్ యొక్క మునుపటి రికార్డ్ హోల్డర్ కంటే ఐదు రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉందని, 2019లో 3.7 తీవ్రత కలిగిన భూకంపం కనుగొనబడిందని నాసా తెలిపింది. శాస్త్రవేత్తల ప్రకారం, ఇన్సైట్ ప్రస్తుత స్థానానికి దాదాపు 8,500 కిలోమీటర్ల దూరంలో 4.2 తీవ్రతతో ఇది సంభవించింది.