Bilawal Bhutto: భారత్లో ముస్లింలను రాక్షసులుగా చూపిస్తున్నారు..
- పహల్గామ్ ఉగ్రవాదుల దాడితో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు..
- అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్కు పరాజయాలు ఎదురవుతున్నాయి..
- భారత్లో ముస్లింలను రాక్షసులుగా చూపిస్తున్నారు: బిలావల్ భుట్టో జర్దారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilawal Bhutto: ఆపరేషన్ సిందూర్పై భారత్ ఏర్పాటు చేసిన అఖిలపక్షం తరహాలోనే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఒక పార్లమెంట్ సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అమెరికా పర్యటనలో భాగంగా.. ఐక్యరాజ్య సమితి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశంలోని ముస్లింలను రాక్షసులుగా చూపించడానికి ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నారని బిలావల్ భుట్టో ఆరోపించారు.
Read Also: V. Hanumantha Rao: రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ని వ్యతిరేకించలేదు..
Also Read
అయితే, అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురవుతున్న పరాజయాలను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో ఒప్పుకున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ అంశానికి సంబంధించిన సమస్యను ఇప్పటికి మనం ఎదుర్కుంటున్నామని తెలిపారు. దీంతో పాటు ఇతర వేదికలపైనా పాకిస్తాన్ కు ఎన్నో అవమానాలు తగిలాయని బిలావల్ భుట్టో పేర్కొన్నారు.
Read Also: V. Hanumantha Rao: రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ని వ్యతిరేకించలేదు..
ఇక, రెండు అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక వ్యవస్థను తీసుకురావడం అంత ఈజీ కాదని పీపీపీ అధినేత బిలావల్ భుట్టో చెప్పుకొచ్చారు. కానీ, టెర్రరిజంపై పోరులో మాత్రం.. మా రెండు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఐఎస్ఐ, రా కలిసి కూర్చొని, ఈ ఉగ్రవాద శక్తులపై పోరాటం కోసం కలిసి పని చేస్తే, ఉగ్ర కార్యకలాపాలు తగ్గిపోతాయని అనుకుంటున్నాను.. లేదంటే, ఇరు దేశాల మధ్య నిరంతర ఘర్షణతో.. విద్రోహ శక్తులను మరింత బలోపేతం చేస్తుందని బిలావల్ భూట్టో ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?