PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
- మాల్దీవులు చేరుకున్న మోడీ
- స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం మాల్దీవులు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో మోడీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు స్వయంగా ఘన స్వాగతం పలికారు. ఈరోజు, రేపు మోడీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. శనివారం మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికి మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్లో భారీ దోపిడీ.. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో వచ్చి చోరీ
Also Read
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
నాలుగు రోజుల్లో రెండు విదేశీ పర్యటనల కోసం మోడీ యూకే, మాల్దీవులకు బయల్దేరి వెళ్లారు. బుధ, గురువారాల్లో లండన్లో పర్యటించారు. యూక్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. లండన్ టూర్ ముగించుకుని శుక్రవారం ఉదయం మోడీ మాల్దీవులు చేరుకున్నారు. శుక్రవారం మాలే ఎయిర్పోర్టులో అడుగుపెట్టగానే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రితో సహా ఆ దేశ సీనియర్ కేబినెట్ సభ్యులంతా ఘన స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ సరికొత్త రికార్డ్! దేశ చరిత్రలో..!
గతేడాది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో మాల్దీవుల టూరిజాన్ని భారతీయులు బాయ్కట్ చేశారు. దీంతో మాల్దీవుల పర్యాటక రంగం దెబ్బతింది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం.. భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి ముయిజ్జు స్వయంగా హాజరై.. తిరిగి భారత్ సంబంధాన్ని బలపరుచుకున్నారు. అనంతరం మరోసారి ఢిల్లీలో పర్యటించి బంధాలను ధృడపరుచుకున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడడంతో పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంది.
తాజావార్తలు
-
Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు