Peace Commission: శాంతి కమిషన్లో ప్రధాని.. మోడీ పేరును ప్రతిపాదించిన మెక్సికో ప్రెసిడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peace Commission: మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్ను రూపొందించడానికి యూఎన్కు రాతపూర్వక ప్రతిపాదనను సమర్పించాలని యోచిస్తున్నట్లు ఎంఎస్ఎన్ వెబ్ పోర్టల్ నివేదించింది. అయితే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్లో భారత ప్రధాని పేరుని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాను రాత పూర్వకంగా ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి అందజేస్తానని కూడా చెప్పారు.
అత్యున్నత కమిషన్లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ఆంటోనియో గుటెర్రెస్, భార ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపడానికి ఒక ప్రతిపాదనను సమర్పించడం, కనీసం ఐదేళ్లపాటు సంధిని కోరుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడం కమిషన్ యొక్క లక్ష్యం. ఆ ముగ్గురు నాయకులు ప్రతి చోట యుద్ధాన్ని ఆపేసేలా ఒక ప్రతిపాదనను అందజేయడమే కాకుండా ఐదేళ్ల యుద్ధాన్ని నిలిపేసేలా ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి శాంతిగా ఉంటాయన్నారు. ఓ సంధి కారణంగా ఎలాంటి హింస లేకుండా శాంతితో ఉంటాయని మెక్సికో అధ్యక్షుడు తెలిపారు.
Also Read
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Srilkana: శ్రీలంకలో నిరసనలకు తెర.. 4నెలల తర్వాత కీలక పరిణామం
యుద్ధప్రాతిపదికన చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ, మెక్సికన్ అధ్యక్షుడు చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్లను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు. ఈ మూడు దేశాలు తాము ప్రతిపాదిస్తున్న మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ప్రతిపాదిత సంధి తైవాన్, ఇజ్రాయోల్, పాలస్తీనా వంటి దేశాలతో కూడా ఒప్పందం చేసుకునేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. అదీగాక ఈ ఒక్క ఏడాదిలోనే ఎన్నో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ఎంతోమంది ప్రజలు చనిపోవడం, నిరాశ్రయులవ్వడం జరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు యూఎన్కు మద్దతుగా చేరాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!