Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- ఆఫ్రికా దేశం మాలిలో భారీ ఉగ్రవాద దాడి..
- దేశ రక్షణ మంత్రిని హతమార్చిన ఉగ్రవాదులు..
- పలు నగరాలలో పేలుళ్ల విధ్వంసం..
- అల్ ఖైదా ఉగ్రవాదులు, తిరుగుబాటుదారుల దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Attack: ఆఫ్రికా దేశం మాలిలో భారీ ఉగ్రవాద దాడి జరిగింది. అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలు, లువారెగ్ తిరుగుబాటుదారులు దేశంలోని పలు ప్రాంతాలపై ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దేశ రక్షణ మంత్రి సాడియో కామారా మరణించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల సంవత్సరాల్లో జరిగిన భారీ ఉగ్రదాడిగా పేర్కొంటున్నారు.
Read Also: LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
Also Read
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
- Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
మాలి రక్షణ మంత్రి సాడియో కామారా నివసించే కాటి సైనిక స్థావరంపై జెఎన్ఐఎం మిలిటెంట్లు దాడి చేశారని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్ఎఫ్ఐ నివేదించింది . ఆయన ఇంటిపై దాడి జరగగా మరణించినట్లు వెల్లడించింది. శనివారం మొదలైన దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. రాజధాని బమాకోలోని ఒక సైనిక స్థావరం వద్ద కూడా దాడి జరిగింది. మాలిలో ఉత్తరాన ఉన్న కిడాల్ నగరంలో చాలా కాలంగా ప్రభుత్వం, తిరుగుబాటుదారులకు పోరాటం జరుగుతోంది. అయితే, తాజా దాడుల తర్వాత ప్రభుత్వం నుంచి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు.
ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో మరణాల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇన్నాళ్లు మారుమూల గ్రామాలను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు, ఈసారి ఏకంగా రాజధాని బమాకోలోని సైనిక స్థావరాన్ని కూడా టార్గెట్ చేశారు. రక్షణ మంత్రిని దాడిలో చంపేశారు. ఒకేసారి పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. మాలిలో ప్రస్తుతం సైనిక ప్రభుత్వం ఉంది. మరోవైపు అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ జేఎన్ఐఎం, ఉత్తర మాలిలో తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని టువారెగ్ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు