PM Modi: కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే, చేసేదేం లేదు..
- కాంగ్రెస్ దేశ వ్యతిరేకుల చేతిలో ‘‘కీలు బొమ్మ’’..
- ఆ పార్టీ బట్టలు చింపుకోవడం తప్పితే వేరే మార్గం లేదు..
- అస్సాంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య భారతీయుల్లో ఆందోళనల్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చేస్తుందని అన్నారు.
భారతదేశ అభివృద్ధిని వ్యతిరేకించే శక్తుల చేతుల్లో కాంగ్రెస్ ‘‘కీలుబొమ్మ’’గా మారిందని ప్రధాని ఆరోపించారు. ‘‘మన దేశ పౌరులు సాధ్యమైనంత తక్కువ కష్టాలను ఎదుర్కొనేలా చూసుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ యుద్ధం దేశ పౌరులపై ప్రభావాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ కీలక సమయంలో, కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తన పాత్రను నిర్వర్తిస్తుందని భావించారు. అయితే, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలకమైన పనిలో కాంగ్రెస్ మరోసారి విఫలమైంది’’ అని దుయ్యబట్టారు.
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని, తద్వారా వారు తనపై దుర్భాషలాడొచ్చని మోడీ అన్నారు. భాత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేని శక్తుల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ను అస్సాంలో తుడిచిపెట్టేశారని, త్వరలో వందేళ్ల పరాజయాలను చవిచూడబోతోందని ప్రధాని సెటైర్లు వేశారు. దేశంలోని ప్రతీ రాష్ట్రం కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పుతుందని అన్నారు. నిరాశతో కాంగ్రెస్ బట్టలు చింపుకోవడం తప్పితే, వారికి వేరే మార్గం కనిపించడం లేదని ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనల్ని ప్రస్తావిస్తూ ప్రధాని విమర్శించారు.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!