Pakistan: పాకిస్తాన్ని భయపెడుతున్న భారీ వర్షాలు.. 41 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 41 మంది మరణించారు. దేశ నైరుతి ప్రాంతంలో పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారని అధికారులు సోమవారం వెల్లడించారు. తూర్పు పంజాబ్ ప్రావిన్సులో గోధుమ పండిస్తున్న రైతులపై పిడుగులు పడటంతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో చాలా మంది మరణించారు. కేవలం పిడుగుల కారణంగానే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం సూచించింది. కొండచరియలు విరిగి పడటంతో పాటు ఆకస్మిక వరదల హెచ్చరిలకు జారీ చేసింది.
Read Also: SRH vs RCB: భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ పంజాబ్లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో పిడుగుపాటు కారణంగా 21 మరణాలు సంభవించాయి. ప్రావిన్సులతో సమన్వయం చేసుకోవాలని పాక్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ఆదేశించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో పిడుగుపాటు వల్ల 8 మంది మరణించారు. దాదాపుగా 25 జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. దక్షిణ సింధ్ ప్రావిన్సులో వరదల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి నలుగురు మరణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో నలుగురు పిల్లలతో సహా 8 మంది మరణించారు.
తాజావార్తలు
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
-
Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!