Pakistan: పాకిస్తాన్ని భయపెడుతున్న భారీ వర్షాలు.. 41 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 41 మంది మరణించారు. దేశ నైరుతి ప్రాంతంలో పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారని అధికారులు సోమవారం వెల్లడించారు. తూర్పు పంజాబ్ ప్రావిన్సులో గోధుమ పండిస్తున్న రైతులపై పిడుగులు పడటంతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో చాలా మంది మరణించారు. కేవలం పిడుగుల కారణంగానే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం సూచించింది. కొండచరియలు విరిగి పడటంతో పాటు ఆకస్మిక వరదల హెచ్చరిలకు జారీ చేసింది.
Read Also: SRH vs RCB: భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత
Also Read
- Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ పంజాబ్లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో పిడుగుపాటు కారణంగా 21 మరణాలు సంభవించాయి. ప్రావిన్సులతో సమన్వయం చేసుకోవాలని పాక్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ఆదేశించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో పిడుగుపాటు వల్ల 8 మంది మరణించారు. దాదాపుగా 25 జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. దక్షిణ సింధ్ ప్రావిన్సులో వరదల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి నలుగురు మరణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో నలుగురు పిల్లలతో సహా 8 మంది మరణించారు.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!