North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
- కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది జూ ఏ..
- తండ్రి తర్వాత బాధ్యతలు చేపట్టేందుకు శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ప్రపంచంలోనే అత్యంత నిగూఢ దేశంగా ఉత్తరకొరియాకు పేరుంది. అక్కడి ప్రజలకు బయట ఓ ప్రపంచం ఉందనే వాస్తవం చాలా వరకు తెలియదు. వారికి తమ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం. అంతగా అక్కడ కిమ్ ప్రాపగండా నడుస్తుంది. ఇక అక్కడి నియమాలు, శిక్షలు ప్రపంచంలో మరే దేశంలో కూడా చూడలేము. ఆ దేశానికి తెలిసిందల్లా అమెరికా, వెస్ట్రన్ దేశాలపై వ్యతిరేకత, మిస్సైళ్ల తయారీ. ఇటీవల కాలంలో ఆ దేశం గూఢచార శాటిలైట్ల ప్రయోగాన్ని కూడా చేపట్టింది. మరోవైపు ఉత్తరకొరియాతో రష్యా సంబంధాలు కూడా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల రష్యా అధినేత పుతిన్ ఆ దేశంలో పర్యటించారు.
Read Also: SP MP Ansari: ఎంపీ అన్సారీకి ఊరట.. 4 ఏళ్ల జైలు శిక్ష ఎత్తివేత
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇదిలా ఉంటే, ఉత్తర కొరియాకు భవిష్యత్ పాలకుడు ఎవరనే దానిపై అనుమానాలు వీడుతున్నాయి. కిమ్ తర్వాత భవిష్యత్ పాలకురాలిగా అతని కూతురు ‘జూ ఏ’ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించడానికి కావాల్సిన శిక్షణ పొందుతున్నట్లు దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ చెప్పింది. కిమ్ ఊబకాయం, అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కూతురిని పాలకురాలిగా చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
12-13 ఏళ్ల వయసున్న జూ ఏ ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో తన తండ్రి కిమ్లో కలిసి కనిపించింది. ముఖ్యంగా బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగ సమయంతో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో దర్శనిమిచ్చింది. అప్పటి నుంచి ఉత్తర కొరియాకు కాబోయే అధినేత ఈమనే అంటూ వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా మీడియా మార్చిలో జూ ఏని తండ్రి మార్గదర్శకత్వంలో గొప్ప వ్యక్తిగా కొనియాడింది. ఒక వేళ ఆ దేశ తదుపరి అధ్యక్షురాలిగా జూ ఏ ఎన్నికైతే, ఈ దేశాన్ని వరసగా పాలిస్తున్న కిమ్ వంశంలోని నాలుగో వ్యక్తి అవుతోంది. ఇప్పటికే కిమ్ తాతతో పాటు తండ్రి వరసగా అధికారాన్ని చేపట్టారు. కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ తర్వాత కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!