North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
- కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది జూ ఏ..
- తండ్రి తర్వాత బాధ్యతలు చేపట్టేందుకు శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ప్రపంచంలోనే అత్యంత నిగూఢ దేశంగా ఉత్తరకొరియాకు పేరుంది. అక్కడి ప్రజలకు బయట ఓ ప్రపంచం ఉందనే వాస్తవం చాలా వరకు తెలియదు. వారికి తమ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం. అంతగా అక్కడ కిమ్ ప్రాపగండా నడుస్తుంది. ఇక అక్కడి నియమాలు, శిక్షలు ప్రపంచంలో మరే దేశంలో కూడా చూడలేము. ఆ దేశానికి తెలిసిందల్లా అమెరికా, వెస్ట్రన్ దేశాలపై వ్యతిరేకత, మిస్సైళ్ల తయారీ. ఇటీవల కాలంలో ఆ దేశం గూఢచార శాటిలైట్ల ప్రయోగాన్ని కూడా చేపట్టింది. మరోవైపు ఉత్తరకొరియాతో రష్యా సంబంధాలు కూడా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల రష్యా అధినేత పుతిన్ ఆ దేశంలో పర్యటించారు.
Read Also: SP MP Ansari: ఎంపీ అన్సారీకి ఊరట.. 4 ఏళ్ల జైలు శిక్ష ఎత్తివేత
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇదిలా ఉంటే, ఉత్తర కొరియాకు భవిష్యత్ పాలకుడు ఎవరనే దానిపై అనుమానాలు వీడుతున్నాయి. కిమ్ తర్వాత భవిష్యత్ పాలకురాలిగా అతని కూతురు ‘జూ ఏ’ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించడానికి కావాల్సిన శిక్షణ పొందుతున్నట్లు దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ చెప్పింది. కిమ్ ఊబకాయం, అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కూతురిని పాలకురాలిగా చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
12-13 ఏళ్ల వయసున్న జూ ఏ ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో తన తండ్రి కిమ్లో కలిసి కనిపించింది. ముఖ్యంగా బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగ సమయంతో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో దర్శనిమిచ్చింది. అప్పటి నుంచి ఉత్తర కొరియాకు కాబోయే అధినేత ఈమనే అంటూ వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా మీడియా మార్చిలో జూ ఏని తండ్రి మార్గదర్శకత్వంలో గొప్ప వ్యక్తిగా కొనియాడింది. ఒక వేళ ఆ దేశ తదుపరి అధ్యక్షురాలిగా జూ ఏ ఎన్నికైతే, ఈ దేశాన్ని వరసగా పాలిస్తున్న కిమ్ వంశంలోని నాలుగో వ్యక్తి అవుతోంది. ఇప్పటికే కిమ్ తాతతో పాటు తండ్రి వరసగా అధికారాన్ని చేపట్టారు. కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ తర్వాత కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..