ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి భారీ ఊరట లభించింది. భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను ఎత్తేసింది. ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించడాన్ని అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అన్సారీ ఘాజీపూర్ ఎంపీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Crazy Rambo: క్రేజీ రాంబో పెద్ద హిట్ కావాలంటున్న అశ్విన్ బాబు
భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ హత్యకేసులో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల శిక్ష విధిస్తూ ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది . హైకోర్టు ఆదేశం ప్రకారం అన్సారీ ఘాజీపూర్ లోక్సభ ఎంపీగా కొనసాగనున్నారు. అన్సారీ అప్పీల్పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ జులై 4న ఇచ్చిన తీర్పును రిజర్వ్ చేశారు. కృష్ణానంద్ రాయ్ హత్యకు సంబంధించిన అపహరణ, హత్య కేసులో గత సంవత్సరం ఘాజీపూర్లోని MP-MLA కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది.
స్థానిక కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించి ఉంటే.. అన్సారీ తన లోక్సభ స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చేది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడిన ఏ MP లేదా రాష్ట్ర శాసనసభ్యుడు అయినా .. అనర్హులుగా ప్రకటించబడతారు. మరో ఆరు సంవత్సరాల పాటు అనర్హులుగా ఉంటారు.
శిక్షను రద్దు చేయాలని కోరుతూ అఫ్జల్ అన్సారీ అప్పీల్ దాఖలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణానంద్ రాయ్ కుమారుడు పీయూష్ కుమార్ రాయ్ శిక్షను పెంచాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు. కానీ తీర్పు మాత్రం అన్సారీకి అనుకూలంగా వచ్చింది.
ఇది కూడా చదవండి: Extramarital Affair: వివాహేతర సంబంధం.. మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి శిక్ష..