Japan Election: నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు.. బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు
- నేడు జపాన్ ప్రధాని పదవికీ ఎన్నికలు..
- ఎన్నికల బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు..
- ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదు: పరిశీలకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan Election: జపాన్ ప్రధాన మంత్రి పదవికి ఈ రోజు (శుక్రవారం) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బరిలో దాదాపు 9 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుత మంత్రులతో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే, కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ ఇమేజ్ ను వినియోగించుకుని.. 2025 అక్టోబర్ లో జరిగే దిగవసభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.
Read Also: Indian Navy : సముద్రంలో పెరగనున్న భారత్ బలం.. నౌకాదళంలోకి 7 కొత్త యుద్ధనౌకలు, ఒక జలాంతర్గామి
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఇక, ఎల్డీపీకి 368 మంది ఎంపీల బలం ఉండగా.. ఎంపీకి ఒక ఓటు ఉండనుంది. 11 లక్షల ఎల్డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీ పడుతున్న అభ్యర్థులకు కేటాయించనున్నారు. అంటే తొలిరౌండ్లో మొత్తం 736 ఓట్లు ఉండనున్నాయి. మొదటి రౌండ్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా నిలవనున్నారు. ఏకంగా తొమ్మిది మంది ఎన్నికల బరిలో ఉండటంతో తొలిరౌండ్లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదని పరిశీలకులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజే రెండో రౌండ్ ఓటింగ్ కూడా జరగే అవకాశం ఉంది. మొదటిరౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెకండ్ రౌండ్ ఓటింగ్కు అర్హత సాధించనున్నారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటు వేసేందుకు అర్హులు.
Read Also: Bruxism Teeth: నిద్రలో పళ్లు కొరుక్కోకుంటున్నారా.? ఇలా చేసి ఉపశమనం పొందండి!
కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 415 ఓట్లు ఉండనున్నాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నాయి. ఈ రేసులో ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెప్పుకొచ్చాయి. మాజీ రక్షణ మంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నట్లు టాక్. మిగతా పోటీదారులుగా యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో, యోషిమాసా హయా, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి ఉన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!