Japan Election: నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు.. బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు
- నేడు జపాన్ ప్రధాని పదవికీ ఎన్నికలు..
- ఎన్నికల బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు..
- ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదు: పరిశీలకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan Election: జపాన్ ప్రధాన మంత్రి పదవికి ఈ రోజు (శుక్రవారం) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బరిలో దాదాపు 9 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుత మంత్రులతో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే, కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ ఇమేజ్ ను వినియోగించుకుని.. 2025 అక్టోబర్ లో జరిగే దిగవసభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.
Read Also: Indian Navy : సముద్రంలో పెరగనున్న భారత్ బలం.. నౌకాదళంలోకి 7 కొత్త యుద్ధనౌకలు, ఒక జలాంతర్గామి
Also Read
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
- S8000 Banderol: చైనా ఇంజిన్.. అమెరికా టెక్నాలజీ.. రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్
ఇక, ఎల్డీపీకి 368 మంది ఎంపీల బలం ఉండగా.. ఎంపీకి ఒక ఓటు ఉండనుంది. 11 లక్షల ఎల్డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీ పడుతున్న అభ్యర్థులకు కేటాయించనున్నారు. అంటే తొలిరౌండ్లో మొత్తం 736 ఓట్లు ఉండనున్నాయి. మొదటి రౌండ్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా నిలవనున్నారు. ఏకంగా తొమ్మిది మంది ఎన్నికల బరిలో ఉండటంతో తొలిరౌండ్లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదని పరిశీలకులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజే రెండో రౌండ్ ఓటింగ్ కూడా జరగే అవకాశం ఉంది. మొదటిరౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెకండ్ రౌండ్ ఓటింగ్కు అర్హత సాధించనున్నారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటు వేసేందుకు అర్హులు.
Read Also: Bruxism Teeth: నిద్రలో పళ్లు కొరుక్కోకుంటున్నారా.? ఇలా చేసి ఉపశమనం పొందండి!
కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 415 ఓట్లు ఉండనున్నాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నాయి. ఈ రేసులో ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెప్పుకొచ్చాయి. మాజీ రక్షణ మంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నట్లు టాక్. మిగతా పోటీదారులుగా యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో, యోషిమాసా హయా, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి ఉన్నారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!