India-US: వాణిజ్య ఒప్పందంపై శుభవార్త.. జైశంకర్ కీలక ట్వీట్
- వాణిజ్య ఒప్పందంపై కీలక అడుగులు
- జైశంకర్ కీలక ట్వీట్
- బలపడుతున్న భారత్-అమెరికా బంధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు తర్జన భర్జన జరుగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ఇరు దేశాల మధ్య దూరం నడుస్తోంది. ప్రస్తుతం అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Karnataka: జర్మన్ ఛాన్సలర్ కంటే రాహుల్ గాంధీ ఎక్కువైపోయారా? కాంగ్రెస్పై బీజేపీ ధ్వజం
Also Read
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మంచి సంభాషణ జరిగినట్లుగా జైశంకర్ పేర్కొన్నారు. వాణిజ్యం, కీలక ఖనిజాలు, అణు సహకారం, రక్షణ, ఇంధనం గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర విషయాలపై కూడా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అంగీకరించినట్లుగా స్పష్టం చేశారు. త్వరలోనే రెండు దేశాలు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: GG W vs MI W: హర్మన్ప్రీత్ హాఫ్ సెంచరీతో ముంబై ఘన విజయం.. గుజరాత్కు తొలి ఓటమి..!
వాణిజ్య అంశాలపై ఇరుపక్షాలు చర్చిస్తామని అమెరికా రాయబారి సెర్గియా గోర్ వెల్లడించిన ఒక రోజు తర్వాత జైశంకర్-మార్కో రూబియో మధ్య వాణిజ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే భారత్లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. ట్రంప్-మోడీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. త్వరలోనే ట్రంప్ భారత్కు వస్తారని పేర్కొన్నారు. మొత్తానికి రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
గతేడాది ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లు అయింది. తాజాగా ఇరాన్తో సంబంధాలు కొనసాగించే దేశాలపై అదనంగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 75 శాతం సుంకం విధించినట్లైంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.
Just concluded a good conversation with @SecRubio.
Discussed trade, critical minerals, nuclear cooperation, defence and energy.
Agreed to remain in touch on these and other issues.
🇮🇳 🇺🇸
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 13, 2026
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!