Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియేకి ఎదురుదెబ్బ.. ఇజ్రాయిల్ దాడిలో 10 మంది కుటుంబీలకు మృతి..
- హమాస్కి ఎదురుదెబ్బ..
- ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్..
- పొలిటికల్ చీఫ్ హనియే కుటుంబీకుల మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli Air Strike: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తాకింది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారుల్లో హమాస్ నేత హనియే ఒకరని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ హనియేను మట్టుపెట్టేందుకు టార్గెట్ చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హనియే కుటుంబంలోని 10 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. అయితే, దీనిని ఇజ్రాయిల్ సైన్యం ఇంకా ధృవీకరించలేదు. అనేక మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయని, అయితే, వాటిని వెలికి తీయడానికి అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని గాజాలోని అధికారి మహ్మద్ బసల్ తెలిపారు.
Read Also: Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
Also Read
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
హమాస్కి పొలిటికల్ బ్యూరో ఛీఫ్గా ఉన్న హనియే ఖతార్లో ఉంటున్నాడు. అంతకుముందు సెంట్రల్ గాజాలో ఏప్రిల్ నెలలో జరిగిన ఇజ్రాయిల్ దాడిలో ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లను కోల్పోయాడు. కొన్ని నివేదికల ప్రకారం.. అతని కుటుంబంలో దాదాపుగా 60 మంది సభ్యులు మరణించారు. తాజాగా దాడిలో హనియే సోదరి జహర్ హనియే సహా 10 మంది మరణించారని తెలుస్తోంది. మరోవైపు గాజా కాల్పుల విరమణ, బందీల ఒప్పందానికి ఇజ్రాయిల్ కట్టుబడి ఉందని సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. మరోవైపు హమాస్ని పూర్తిగా మట్టుపెట్టేవరకు యుద్ధాన్ని ముగించమని పార్లమెంట్లో చెప్పారు.
గతేడాది అక్టోబర్ 07న ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు, వందలాది రాకెట్లతో దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ గ్రామాల్లోకి చేరి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 1200 మంది మరణించగా, 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్ని పూర్తిగా మట్టుబెట్టే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..