Israel: బందీలను విడిచే దాకా ఎలాంటి ఒప్పందం ఉండదు.. దాడులు ఆపబోం..
Israel:బందీలను అప్పగించే వరకు ఎలాంటి ఒప్పందం లేదన ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. యుద్ధం నిలిపేస్తే చర్చలకు సిద్ధమని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ వ్యాఖ్యలు చేసింది. బందీలను అప్పగించడం ఒప్పందంలో భాగం కాకుంటే గాజాలో పోరాటాన్ని ఆపేది లేని శుక్రవారం ఇజ్రాయిల్ సీనియర్ భద్రతా అధికారి చెప్పారు. గాజాలో ఇజ్రాయిల్ పోరాటాన్ని నిలిపేసినంత కాలం, పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఒక ఒప్పందాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Nivetha Pethuraj : పోలీసులతో నివేతా వాదన.. అస్సలు విషయం బయట పడిందిగా..
Also Read
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
బందీల విడుదల ఒప్పందంలో భాగంగా కానీ ఏ సంధికి ఇజ్రాయిల్ ఒప్పుకోదని ఇజ్రాయిల్ చెప్పింది. ఇప్పటికే ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న గాజాలోని దక్షిణ భాగాన్ని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. రఫాపై క్రమం తప్పకుండా దాడులు చేస్తోంది. ఇన్నాళ్లు ఉత్తరాన ఉన్న గాజా పట్టణాన్ని జల్లెడ పట్టినప్పటికీ, ఇజ్రాయిల్ బందీలను కనుగొనలేకపోయింది. దీంతో దక్షిణాన ఉన్న రఫా ప్రాంతంలో బందీలు ఉన్నట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రఫాలోని హమాస్ స్థావరాలను నేలమట్టం చేసేందుకు దాడులు చేపడుతోంది. మరోవైపు ఇటీవల రఫాలోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో పిల్లలతో పాటు సాధారణ ప్రజలు మరణించడం అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ విమర్శలు ఎదుర్కొంది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ టెర్రరిస్టులు దాడులకు పాల్పడి 1200 మందిని హతమార్చారు. దీంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. గతంలో కుదిరిన సంధిలో హమాస్ మిలిటెంట్లు కొంతమంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మరో 90 మంది వరకు బందీలు హమాస్ చెరలో ఉన్నారు. ఇదిలా ఉంటే, హమాస్ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో 36 వేల మంది వరకు అమాయకపు పాలస్తీనా పౌరులు మరణించారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో