Ship Hijack: భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ship Hijack: టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే విషయం ప్రస్తుతానికి తెలియదు. హైజాక్ విషయాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది.
దక్షిణ ఎర్ర సముద్రంలో యెమెన్ సమీపంలోని హౌతీలు ఒక కార్గో షిప్ను హైజాక్ చేశారు. ఇది ప్రపంచ పరిణామాల్లోఇది చాలా ఘోరమైన సంఘటన. ఓడ టర్కీ నుంచి భారతదేశానికి వెళ్లే మార్గంలో ఉంది. వివిధ దేశాలకు చెందిన సిబ్బంది నౌకలో ఉన్నారు. ఇజ్రాయిలీలు ఇందులో లేరు, ఇది ఇజ్రాయిల్ నౌక కాదు’’ అని ట్వీట్ లో పేర్కొంది.
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
Read Also: Extra Marital Affairs: ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు.. ఒక చోట భార్య, మరోచోట భర్త హత్య..
అంతర్జాతీయ నౌకపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేయడాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నౌక బ్రిటీష్ కంపెనీకి చెందిందని, జపాన్ సంస్థచే నిర్వహిస్తున్నట్లు, ఈ నౌకను ఇరాన్ మార్గదర్శకత్వంతో యెమెన్ హౌతీలు హైజాక్ చేసిందని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ నౌక బ్రిటీష్ కంపెనీ కింద రిజిస్టర్ చేయబడిందని, దీంట్లో ఇజ్రాయిల్ వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్కి పాక్షికంగా యాజమాన్యం ఉందని, హైజాక్ సమయంలో ఈ నౌకను జపాన్ కంపెనీకి లీజుకు ఇచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్కి సపోర్ట్ చేస్తోంది. ఇజ్రాయిల్ తో సంబంధం ఉన్న నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులు ఆగిపోయే వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని ఇటీవల హౌతీలు ప్రకటన చేశారు.
The hijacking of a cargo ship by the Houthis near Yemen in the southern Red Sea is a very grave incident of global consequence.
The ship departed Turkey on its way to India, staffed by civilians of various nationalities, not including Israelis. It is not an Israeli ship.— Israel Defense Forces (@IDF) November 19, 2023
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!