Ship Hijack: భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..
Ship Hijack: టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే విషయం ప్రస్తుతానికి తెలియదు. హైజాక్ విషయాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది.
దక్షిణ ఎర్ర సముద్రంలో యెమెన్ సమీపంలోని హౌతీలు ఒక కార్గో షిప్ను హైజాక్ చేశారు. ఇది ప్రపంచ పరిణామాల్లోఇది చాలా ఘోరమైన సంఘటన. ఓడ టర్కీ నుంచి భారతదేశానికి వెళ్లే మార్గంలో ఉంది. వివిధ దేశాలకు చెందిన సిబ్బంది నౌకలో ఉన్నారు. ఇజ్రాయిలీలు ఇందులో లేరు, ఇది ఇజ్రాయిల్ నౌక కాదు’’ అని ట్వీట్ లో పేర్కొంది.
Also Read
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
Read Also: Extra Marital Affairs: ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు.. ఒక చోట భార్య, మరోచోట భర్త హత్య..
అంతర్జాతీయ నౌకపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేయడాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నౌక బ్రిటీష్ కంపెనీకి చెందిందని, జపాన్ సంస్థచే నిర్వహిస్తున్నట్లు, ఈ నౌకను ఇరాన్ మార్గదర్శకత్వంతో యెమెన్ హౌతీలు హైజాక్ చేసిందని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ నౌక బ్రిటీష్ కంపెనీ కింద రిజిస్టర్ చేయబడిందని, దీంట్లో ఇజ్రాయిల్ వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్కి పాక్షికంగా యాజమాన్యం ఉందని, హైజాక్ సమయంలో ఈ నౌకను జపాన్ కంపెనీకి లీజుకు ఇచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్కి సపోర్ట్ చేస్తోంది. ఇజ్రాయిల్ తో సంబంధం ఉన్న నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులు ఆగిపోయే వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని ఇటీవల హౌతీలు ప్రకటన చేశారు.
The hijacking of a cargo ship by the Houthis near Yemen in the southern Red Sea is a very grave incident of global consequence.
The ship departed Turkey on its way to India, staffed by civilians of various nationalities, not including Israelis. It is not an Israeli ship.— Israel Defense Forces (@IDF) November 19, 2023
తాజావార్తలు
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో