Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ
- ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన
- పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు ఇలా నడుస్తుండగానే రెండు రోజుల గ్యాప్లో వెస్ట్ బ్యాంక్లోని మాలే అడుమిమ్ సెటిల్మెంట్ ప్రాంతాన్ని నెతన్యాహు సందర్శించారు. ఇకపై ఈ భూభాగం తమదేనని ప్రకటించారు. ఇక్కడ వేలాది కొత్త గృహాలు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: CP Radhakrishnan: నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం.. ఎన్డీఏ నేతల హాజరు
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇక ఈ వివాదాస్పద E1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లే ఒప్పందంపై నెతన్యాహు సంతకం కూడా చేశారు. దీంతో ఇక పాలస్తీనా రాజ్యం ఉండదని ప్రపంచానికి సంకేతం ఇచ్చారు. జెరూసలేం తూర్పున ఉన్న ప్రాంతంలో వేలాది కొత్త గృహాల నిర్మాణం కోసం చేపట్టిన E1 ప్రణాళికకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికా సంఘం నుంచి కూడా తుది ఆమోదం లభించేసింది.
ఇది కూడా చదవండి: Charlie Kirk Murder: చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల.. వయస్సు ఎంతంటే ..!
వచ్చే యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యం గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. ఇందుకోసం కసరత్తు చేస్తుండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బాంబ్ పేల్చారు. ఇక పాలస్తీనా దేశమే ఉండబోదని ప్రకటించారు. ఒకవేళ మిత్రదేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తే మాత్రం ఇజ్రాయెల్ ఒంటరిగా నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది.
జెరూసలేంకు తూర్పున 12 చదరపు కి.మీ విస్తర్ణంలో ఉన్న స్థావరాన్ని తూర్పు 1 లేదా E 1 గా పిలుస్తారు. ఇది మాలే అడుమిమ్ ప్రక్కనే ఉంటుంది. అయితే అమెరికా, యూరోపియన్ దేశాల అభ్యంతరాల తర్వాత 2012-2020లో ఈ ప్రాజెక్ట్ స్తంభించిపోయింది. తిరిగి ఇన్నాళ్ల తర్వాత ప్రాజెక్ట్ చేపడుతున్నారు. కొత్త రోడ్లు, ప్రధాన మౌలిక సదుపాయాల కోసం దాదాపు 1 బిలియన్ USD ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనా భూభాగంలో ఉన్న అన్ని ఇజ్రాయెల్ స్థావరాలను అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ఇది నాల్గవ జెనీవా కన్వెన్షన్ ఆధారంగా ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం ఈ స్థావరాలకు చట్టపరమైన చెల్లుబాటు లేదని చెబుతుంది. అయితే ఈ వాదనను ఇజ్రాయెల్ తప్పుపడుతుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం ఏ దిశగా వెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!