ట్రంప్ బెదిరింపులు వేళ ఇరాన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదేమీ హతమయ్యాడు. ఈ మేరకు మజీద్ ఖాదేమీ మరణాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ధృవీకరించినట్లుగా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్లోని ఇస్ఫాహాన్లో 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబును అమెరికా పేల్చింది. ఇరాన్లోని ప్రధాన నగరమైన ఇస్ఫహాన్లోని ముఖ్యమైన ఆయుధాగారంపై సుమారు 907 కిలోగ్రాముల బరువైన బంకర్-బస్టర్ బాంబులతో దాడి చేసింది.
US-Iran Conflict: అమెరికా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించి, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ గట్టి అల్టిమేటం ఇచ్చింది. అమెరికా సైనికులు బస చేస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తామని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న యూఎస్ సైనికులు తమ స్థావరాలను వదిలేసి హోటళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారని, అమెరికన్లకు ఆశ్రయం ఇచ్చే హోటళ్లను అమెరికా ఆస్తులుగానే పరిగణిస్తామని హెచ్చరించింది.