Israel-Hamas War: హమాస్ టెన్నెల్స్లో ఐదుగురు బందీల మృతదేహాలు.. గాజా దాడిలో 78 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది.
హమాస్ ఈ టన్నెల్స్ని కమాండ్ సెంటర్లుగా వాడుకుంటుందని ఇజ్రాయిల్ బలగాలు ప్రపంచం ముందు సాక్ష్యాలను చూపించాయి. గాజా నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల కింద ఈ టన్నెల్ వ్యవస్థ ఉండటాన్ని కూడా ఇజ్రాయిల్ గుర్తించింది. ఈ టన్నెల్స్ లోనే ఇజ్రాయిలీ బందీలను హమాస్ ఉంది. తాజాగా ఇజ్రాయిల్ బలగాలు ఐదుగురు ఇజ్రాయిలీ బందీల మృతదేహాలను సొరంగాల్లో గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిలీ మిలటరీ చెప్పింది.
Also Read
Read Also: Christmas: ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్లో “నో క్రిస్మస్”.. కారణం ఏంటంటే..?
ఇదిలా ఉంటే గాజా స్ట్రిప్ మధ్య భాగంలోని మాఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 70 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం తెలిపారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లో మరో వైమానిక దాడిలో 8 మంది మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. సోమవారం ఉదయం వరకు ఈ దాడులు కొనసాగాయి. సెంట్రల్ గాజాలోని అల్-బురీజ్ పై దాడి చేసింది. ఇజ్రాయిల్ వైమానిక దాడిని భయంకరమైన ఊచకోతగా హమాస్ అభివర్ణించింది. గతంలో గాజా ఉత్తర ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ప్రస్తుతం, దక్షిణ భాగంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు చేస్తోంది.
అక్టోబర్7న హమాస్, ఇజ్రాయిల్పై దాడులు చేసి 1200 మందిని ఊచకోత కోసింది. పిల్లలు, పెద్దలు, మహిళలు అని చూడకుండా దొరికిన వాళ్లను దొరికినట్లుగా చంపేసింది. మరో 240 మందిని బందీలుగా చేసుకుంది. అయితే ఇటీవల ఇజ్రాయిల్-హమాస్ సంధి ఒప్పందంలో 105 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న 200 మంది పాలస్తీనా ఖైదీలను వదిలేసింది. మరోవైపు ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో 20,400 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!