Christmas: ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్లో “నో క్రిస్మస్”.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christmas: ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఏసు క్రీస్తు పుట్టిన బెత్లెహమ్లో మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. సాధారణంగా ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగ రోజు బెత్లెహమ్ క్రీస్తు ఆరాధకులతో ఎంతో రద్దీగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం అంతా నిలిచింది.
ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్లో క్రిస్మస్ వేడుకలను ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావితం చేసింది. ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఉన్న ఈ పట్టణం నిర్జనంగా మారిపోయింది. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంకి దక్షిణంగా ఉన్న బెత్లెహమ్లోనే క్రీస్తు పుట్టినట్లు అంతా భావిస్తారు. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ దాడి కారణంగా, ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం నెలకొంది. దీంతో గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్లోని హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది అక్కడి క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. ప్రజలు ఎవరూ రావడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. తమ జీవితంలో ఇప్పటి వరకు ఇంత చెత్త క్రిస్మస్ పండగను ఎప్పుడూ చూడలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
Read Also: Indonesia : ఇండోనేషియాలోని నికెల్ ప్లాంట్లో పేలుడు.. 13 మంది మృతి.. డజన్లమందికి గాయాలు
జెరూసలెంకి దక్షిణంగా ఉన్న బెత్లహమ్లోని జీసస్ జన్మించిన ప్రదేశంగా భావించే చర్చ్ ఆఫ్ ది నేటివిటీని చూడటానికి ప్రపంచంలో నలుమూలల నుంచి క్రైస్తవులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. అయితే అక్టోబర్ 7కి ముందు అక్కడి హోటళ్లు, వ్యాపారాలు రద్దీగా ఉంటేవి, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధం ప్రారంభమైన తర్వాత, వచ్చే ఏడాదితో సహా బుకింగ్స్ అన్ని రద్దు చేసుకున్నారు. ఇజ్రాయిల్ పొరగున ఉన్న పాలస్తీనాకి సంబంధించిన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని 1967 యుద్ధంలో ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఈ భూభాగంలో యూదుల నివాసాలు పెరిగాయి.
గత అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు, ఇజ్రాయిల్పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాతో పాటు వెస్ట్ బ్యాంకుపై ఇజ్రాయిల్ ఆర్మీ దాడి చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!