Christmas: ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్లో “నో క్రిస్మస్”.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christmas: ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఏసు క్రీస్తు పుట్టిన బెత్లెహమ్లో మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. సాధారణంగా ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగ రోజు బెత్లెహమ్ క్రీస్తు ఆరాధకులతో ఎంతో రద్దీగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం అంతా నిలిచింది.
ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్లో క్రిస్మస్ వేడుకలను ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావితం చేసింది. ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఉన్న ఈ పట్టణం నిర్జనంగా మారిపోయింది. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంకి దక్షిణంగా ఉన్న బెత్లెహమ్లోనే క్రీస్తు పుట్టినట్లు అంతా భావిస్తారు. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ దాడి కారణంగా, ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం నెలకొంది. దీంతో గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్లోని హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది అక్కడి క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. ప్రజలు ఎవరూ రావడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. తమ జీవితంలో ఇప్పటి వరకు ఇంత చెత్త క్రిస్మస్ పండగను ఎప్పుడూ చూడలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
Read Also: Indonesia : ఇండోనేషియాలోని నికెల్ ప్లాంట్లో పేలుడు.. 13 మంది మృతి.. డజన్లమందికి గాయాలు
జెరూసలెంకి దక్షిణంగా ఉన్న బెత్లహమ్లోని జీసస్ జన్మించిన ప్రదేశంగా భావించే చర్చ్ ఆఫ్ ది నేటివిటీని చూడటానికి ప్రపంచంలో నలుమూలల నుంచి క్రైస్తవులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. అయితే అక్టోబర్ 7కి ముందు అక్కడి హోటళ్లు, వ్యాపారాలు రద్దీగా ఉంటేవి, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధం ప్రారంభమైన తర్వాత, వచ్చే ఏడాదితో సహా బుకింగ్స్ అన్ని రద్దు చేసుకున్నారు. ఇజ్రాయిల్ పొరగున ఉన్న పాలస్తీనాకి సంబంధించిన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని 1967 యుద్ధంలో ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఈ భూభాగంలో యూదుల నివాసాలు పెరిగాయి.
గత అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు, ఇజ్రాయిల్పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాతో పాటు వెస్ట్ బ్యాంకుపై ఇజ్రాయిల్ ఆర్మీ దాడి చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?