Israel-Hamas War: హమాస్ టెన్నెల్స్లో ఐదుగురు బందీల మృతదేహాలు.. గాజా దాడిలో 78 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది.
హమాస్ ఈ టన్నెల్స్ని కమాండ్ సెంటర్లుగా వాడుకుంటుందని ఇజ్రాయిల్ బలగాలు ప్రపంచం ముందు సాక్ష్యాలను చూపించాయి. గాజా నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల కింద ఈ టన్నెల్ వ్యవస్థ ఉండటాన్ని కూడా ఇజ్రాయిల్ గుర్తించింది. ఈ టన్నెల్స్ లోనే ఇజ్రాయిలీ బందీలను హమాస్ ఉంది. తాజాగా ఇజ్రాయిల్ బలగాలు ఐదుగురు ఇజ్రాయిలీ బందీల మృతదేహాలను సొరంగాల్లో గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిలీ మిలటరీ చెప్పింది.
Also Read
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
- Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
- Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
Read Also: Christmas: ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్లో “నో క్రిస్మస్”.. కారణం ఏంటంటే..?
ఇదిలా ఉంటే గాజా స్ట్రిప్ మధ్య భాగంలోని మాఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 70 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం తెలిపారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లో మరో వైమానిక దాడిలో 8 మంది మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. సోమవారం ఉదయం వరకు ఈ దాడులు కొనసాగాయి. సెంట్రల్ గాజాలోని అల్-బురీజ్ పై దాడి చేసింది. ఇజ్రాయిల్ వైమానిక దాడిని భయంకరమైన ఊచకోతగా హమాస్ అభివర్ణించింది. గతంలో గాజా ఉత్తర ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ప్రస్తుతం, దక్షిణ భాగంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు చేస్తోంది.
అక్టోబర్7న హమాస్, ఇజ్రాయిల్పై దాడులు చేసి 1200 మందిని ఊచకోత కోసింది. పిల్లలు, పెద్దలు, మహిళలు అని చూడకుండా దొరికిన వాళ్లను దొరికినట్లుగా చంపేసింది. మరో 240 మందిని బందీలుగా చేసుకుంది. అయితే ఇటీవల ఇజ్రాయిల్-హమాస్ సంధి ఒప్పందంలో 105 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న 200 మంది పాలస్తీనా ఖైదీలను వదిలేసింది. మరోవైపు ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో 20,400 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!