Iran War: కోవిడ్ తర్వాత అతిపెద్ద ‘‘లాక్డౌన్’’కు ప్రపంచం సిద్ధమవుతోందా..?
- ప్రపంచం మరో కోవిడ్ తరహా ‘‘లాక్డౌన్’’కు సిద్ధమవుతోందా..?
- ఇరాన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. ముఖ్యంగా, ఇజ్రాయిల్ అమెరికా దాడుల కారణంగా ఇరాన్ ఇంధన రవాణాకు చాలా కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 112 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో గ్యాస్ ధర గ్యాలన్కు 5 డాలర్లు దాటాయి. దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీవ్రంగా పెరుగుతున్నాయి.
ఇదే కాకుండా, ఇంధన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు కూడా తగ్గుతున్నాయి. దీంతో ప్రమాణ ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. పలు దేశాల ప్రభుత్వాలు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించాలని కోరుతున్నాయి. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ వారంలోనే తన విమాన సర్వీసులలో 5% తగ్గించింది. ఇతర దేశాల్లోని విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను తగ్గిస్తున్నాయి. అవనసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రభుత్వాలు కోరడం చూస్తే గతంలో కోవిడ్ ‘‘లాక్డౌన్’’ గుర్తుకు వస్తోంది.
Also Read
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
Read Also: Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
ఇక చాలా దేశాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ను రేషన్ పద్ధతిలో ఇస్తున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాలు ఇంధన సంక్షోభంతో గణతంత్ర వేడుకల్ని కూడా క్యాన్సల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. జపాన్లో చమురు రేషన్ అమలులోకి వచ్చింది. దక్షిణ కొరియా కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో పెట్రోల్ కోసం పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం తన ప్రజల్ని కోరుతోంది. భారతదేశానికి అవసరమయ్యే ముడి చమురులో 80 శాతం దిగుమతి అవుతోంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, ముఖ్యంగా ఖతార్ నుంచి ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో భారత చమురు అవసరాలు కూడా ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాయి.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ‘ఆయిల్ షాక్ల నుండి రక్షణ’ అనే పేరుతో 10 సూత్రాల ప్రణాళికను విడుదల చేసింది. ఇది ప్రభుత్వాలకు సూచనలు చేసింది. వాహన వినియోగంపై నియంత్రణ, హైవేల్లో స్పీడ్ లిమిట్ తగ్గింపు, వర్క్ ఫ్రం హోమ్, గ్యాస్ బదులుగా ఎలక్ట్రిక్ వినియోగం వంటి సూచనలు చేసింది.
Global oil markets are facing a historic supply disruption amid the war in the Middle East, pushing up prices for consumers.
Our new report sets out 10 immediate demand-side options to help governments, businesses & households ease the economic impacts → https://t.co/1XZIgeA2BG pic.twitter.com/vwcrjRUmvK
— International Energy Agency (@IEA) March 20, 2026
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!