Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- అణు నగరంగా ‘‘డిమోనా’’కు పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimona: ఇరాన్ యుద్ధం ప్రారంభమై 3 వారాలకు చేరింది. అయినప్పటికీ యుద్ధ తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మరోవైపు, దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్పై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ‘అణు నగరం’’గా చెప్పబడుతున్న డియోనాపై దాడి చేసింది. డిమోనాను ఇజ్రాయిల్లోనే ‘‘లిటిల్ ఇండియా’’గా చెబుతారు. డిమోనాలో జిలేబీలు, చాట్ సువాసనలు గుబాళిస్తుంటాయి. భారత్ లాగే రంగు రంగుల బట్టలు కనిపిస్తుంటాయి.
ఇరాన్లోని నతాంజ్ అణు సంపన్న కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా డియోమాన నగరంపై శనివారం ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 33 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్కు చెందిన కీలక అణు కేంద్రంగా ఉన్న డిమోనా “లిటిల్ ఇండియా” అనే బిరుదును కూడా సంపాదించుకుంది. ఇక్కడి 7,500 మంది భారతీయ-యూదు కమ్యూనిటి పట్టణ జనాభాలో సుమారు 30 శాతంగా ఉంది. నగరంలో మరాఠీ, కొద్దిగా హిందీ వినిపిస్తాయి, క్రికెట్కు ఫ్యాన్ ఉంటారు. దుకాణాలలో సోన్పాప్డీ, గులాబ్ జామున్, పాప్రి చాట్, భేల్పురి వంటి భారతీయ వంటకాలు కనిపిస్తుంటాయి.
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
భారత్ నుంచి ఇజ్రాయిల్కు 1950, 1960లలో వలసలు కొనసాగాయి. వీరిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయిలీలు, కేరళకు చెంది కొచిన్ యుదూలు, కోల్కతాల నుంచి బాగ్దాదీ యూదులు వలస వెళ్లారు. మిజోరం, మణిపూర్ నుంచి బెనై మోనాషే వంటి వారు ఇజ్రాయిల్కు వెళ్లి స్థిరపడ్డారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువ మంది వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులుగా పనిచేస్తున్నారు. డిమోనాలో భారతీయ పండగలైన దీపావళి, ఓనం వంటి పండగలు జరుపుకుంటారు. నవంబర్ 2025లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్ట్లో నెల రోజుల పాటు జరిగిన సినిమా ప్రదర్శనలకు థియేటర్లు కిక్కిరిసిపోయాయి, కొన్ని నెలల క్రితం జరిగిన మొట్టమొదటి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్కు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి.
ఇజ్రాయిల్ ‘‘అణు నగరం’’..
నెగెవ్ ఎడారిలో ఉన్న డిమోనాలోని షిమోన్ పెరెస్ నెగెవ్ అణు కేంద్రాన్ని ఇజ్రాయిల్ ను ఒక పరిశోధనా కేంద్రంగా ఉంది. 1958లో నిర్మాణం ప్రారంభమై, 1964 నాటికి ఇది ఆపరేషన్ స్థితికి వచ్చింది.
ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతమైన డిమోనా, అరద్పై ఇరాన్ శనివారం క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ క్షిపణుల్ని ఇజ్రాయిల్ అడ్డుకోలేకపోయింది. నతాంజ్ను టార్గెట్ చేసినందుకే డిమోనాను టార్గెట్ చేసినట్లు ఇరాన్ చెప్పింది.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!