Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- అణు నగరంగా ‘‘డిమోనా’’కు పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimona: ఇరాన్ యుద్ధం ప్రారంభమై 3 వారాలకు చేరింది. అయినప్పటికీ యుద్ధ తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మరోవైపు, దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్పై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ‘అణు నగరం’’గా చెప్పబడుతున్న డియోనాపై దాడి చేసింది. డిమోనాను ఇజ్రాయిల్లోనే ‘‘లిటిల్ ఇండియా’’గా చెబుతారు. డిమోనాలో జిలేబీలు, చాట్ సువాసనలు గుబాళిస్తుంటాయి. భారత్ లాగే రంగు రంగుల బట్టలు కనిపిస్తుంటాయి.
ఇరాన్లోని నతాంజ్ అణు సంపన్న కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా డియోమాన నగరంపై శనివారం ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 33 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్కు చెందిన కీలక అణు కేంద్రంగా ఉన్న డిమోనా “లిటిల్ ఇండియా” అనే బిరుదును కూడా సంపాదించుకుంది. ఇక్కడి 7,500 మంది భారతీయ-యూదు కమ్యూనిటి పట్టణ జనాభాలో సుమారు 30 శాతంగా ఉంది. నగరంలో మరాఠీ, కొద్దిగా హిందీ వినిపిస్తాయి, క్రికెట్కు ఫ్యాన్ ఉంటారు. దుకాణాలలో సోన్పాప్డీ, గులాబ్ జామున్, పాప్రి చాట్, భేల్పురి వంటి భారతీయ వంటకాలు కనిపిస్తుంటాయి.
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
భారత్ నుంచి ఇజ్రాయిల్కు 1950, 1960లలో వలసలు కొనసాగాయి. వీరిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయిలీలు, కేరళకు చెంది కొచిన్ యుదూలు, కోల్కతాల నుంచి బాగ్దాదీ యూదులు వలస వెళ్లారు. మిజోరం, మణిపూర్ నుంచి బెనై మోనాషే వంటి వారు ఇజ్రాయిల్కు వెళ్లి స్థిరపడ్డారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువ మంది వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులుగా పనిచేస్తున్నారు. డిమోనాలో భారతీయ పండగలైన దీపావళి, ఓనం వంటి పండగలు జరుపుకుంటారు. నవంబర్ 2025లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్ట్లో నెల రోజుల పాటు జరిగిన సినిమా ప్రదర్శనలకు థియేటర్లు కిక్కిరిసిపోయాయి, కొన్ని నెలల క్రితం జరిగిన మొట్టమొదటి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్కు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి.
ఇజ్రాయిల్ ‘‘అణు నగరం’’..
నెగెవ్ ఎడారిలో ఉన్న డిమోనాలోని షిమోన్ పెరెస్ నెగెవ్ అణు కేంద్రాన్ని ఇజ్రాయిల్ ను ఒక పరిశోధనా కేంద్రంగా ఉంది. 1958లో నిర్మాణం ప్రారంభమై, 1964 నాటికి ఇది ఆపరేషన్ స్థితికి వచ్చింది.
ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతమైన డిమోనా, అరద్పై ఇరాన్ శనివారం క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ క్షిపణుల్ని ఇజ్రాయిల్ అడ్డుకోలేకపోయింది. నతాంజ్ను టార్గెట్ చేసినందుకే డిమోనాను టార్గెట్ చేసినట్లు ఇరాన్ చెప్పింది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!