Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..
- అణు నగరంగా ‘‘డిమోనా’’కు పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimona: ఇరాన్ యుద్ధం ప్రారంభమై 3 వారాలకు చేరింది. అయినప్పటికీ యుద్ధ తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మరోవైపు, దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్పై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ‘అణు నగరం’’గా చెప్పబడుతున్న డియోనాపై దాడి చేసింది. డిమోనాను ఇజ్రాయిల్లోనే ‘‘లిటిల్ ఇండియా’’గా చెబుతారు. డిమోనాలో జిలేబీలు, చాట్ సువాసనలు గుబాళిస్తుంటాయి. భారత్ లాగే రంగు రంగుల బట్టలు కనిపిస్తుంటాయి.
ఇరాన్లోని నతాంజ్ అణు సంపన్న కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా డియోమాన నగరంపై శనివారం ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 33 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్కు చెందిన కీలక అణు కేంద్రంగా ఉన్న డిమోనా “లిటిల్ ఇండియా” అనే బిరుదును కూడా సంపాదించుకుంది. ఇక్కడి 7,500 మంది భారతీయ-యూదు కమ్యూనిటి పట్టణ జనాభాలో సుమారు 30 శాతంగా ఉంది. నగరంలో మరాఠీ, కొద్దిగా హిందీ వినిపిస్తాయి, క్రికెట్కు ఫ్యాన్ ఉంటారు. దుకాణాలలో సోన్పాప్డీ, గులాబ్ జామున్, పాప్రి చాట్, భేల్పురి వంటి భారతీయ వంటకాలు కనిపిస్తుంటాయి.
Also Read
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
- Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
భారత్ నుంచి ఇజ్రాయిల్కు 1950, 1960లలో వలసలు కొనసాగాయి. వీరిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయిలీలు, కేరళకు చెంది కొచిన్ యుదూలు, కోల్కతాల నుంచి బాగ్దాదీ యూదులు వలస వెళ్లారు. మిజోరం, మణిపూర్ నుంచి బెనై మోనాషే వంటి వారు ఇజ్రాయిల్కు వెళ్లి స్థిరపడ్డారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువ మంది వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులుగా పనిచేస్తున్నారు. డిమోనాలో భారతీయ పండగలైన దీపావళి, ఓనం వంటి పండగలు జరుపుకుంటారు. నవంబర్ 2025లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్ట్లో నెల రోజుల పాటు జరిగిన సినిమా ప్రదర్శనలకు థియేటర్లు కిక్కిరిసిపోయాయి, కొన్ని నెలల క్రితం జరిగిన మొట్టమొదటి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్కు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి.
ఇజ్రాయిల్ ‘‘అణు నగరం’’..
నెగెవ్ ఎడారిలో ఉన్న డిమోనాలోని షిమోన్ పెరెస్ నెగెవ్ అణు కేంద్రాన్ని ఇజ్రాయిల్ ను ఒక పరిశోధనా కేంద్రంగా ఉంది. 1958లో నిర్మాణం ప్రారంభమై, 1964 నాటికి ఇది ఆపరేషన్ స్థితికి వచ్చింది.
ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతమైన డిమోనా, అరద్పై ఇరాన్ శనివారం క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ క్షిపణుల్ని ఇజ్రాయిల్ అడ్డుకోలేకపోయింది. నతాంజ్ను టార్గెట్ చేసినందుకే డిమోనాను టార్గెట్ చేసినట్లు ఇరాన్ చెప్పింది.
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!