Iran Presidential Elections: ఇరాన్లో రెండో దఫా అధ్యక్ష ఎన్నికలు.. అభ్యర్థులు వీరే..
- ఇరాన్లో రెండో దఫా అధ్యక్ష ఎన్నికలు
- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
- పోటీ పడుతున్న అతివాద నేత సయీద్ జలీలీ..సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Presidential Elections: ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో శుక్రవారం ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అతివాద నేత సయీద్ జలీలీ, సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ మధ్య నెలకొంది. అంతకుముందు జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఓటింగ్లో ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. ఏ అభ్యర్థికీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాకపోవడంతో ఇరాన్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. జైలు శిక్ష పడిన నోబెల్ గ్రహీత నర్గీస్ మహమ్మదీ సహా పలువురు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
Read Also: Noida Fire : నోయిడా మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం
Also Read
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యం కాగా.. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలను పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలీలీ 38.6 శాతం ఓట్లు సాధించారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్కు అర్హత సాధించారు. ఈ క్రమంలో మసౌద్ పెజెష్కియాన్, సయూద్ జలీలీలమాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించే బాధ్యత ఆ దేశ హోంమంత్రి అహ్మద్ వహీద్పై ఉంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభం కాగా.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఓటేసిన అయతుల్లా అలీ ఖమేనీ
దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ తన నివాసంలో ఓటు వేశారు. “ప్రజలు మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారని నేను తెలుసుకున్నాను. ప్రజలు ఓటు వేసి ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవాలి.” అయితే, గత వారం ఓటు వేయని వారు దేశంలోని షియా మతతత్వానికి వ్యతిరేకం కాదని అయతుల్లా అలీ ఖమేనీ బుధవారం అన్నారు. ఇదిలా ఉండగా.. జలీలీ గెలిస్తే ఇరాన్లో తాలిబాన్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తారని పెజెష్కియాన్ మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు. పెజెష్కియాన్ భయాన్ని వ్యాప్తి చేస్తున్నాడని జలీలీ ఆరోపించారు.
తాజావార్తలు
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!