Iran Presidential Elections: ఇరాన్లో రెండో దఫా అధ్యక్ష ఎన్నికలు.. అభ్యర్థులు వీరే..
- ఇరాన్లో రెండో దఫా అధ్యక్ష ఎన్నికలు
- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
- పోటీ పడుతున్న అతివాద నేత సయీద్ జలీలీ..సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Presidential Elections: ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో శుక్రవారం ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అతివాద నేత సయీద్ జలీలీ, సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ మధ్య నెలకొంది. అంతకుముందు జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఓటింగ్లో ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. ఏ అభ్యర్థికీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాకపోవడంతో ఇరాన్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. జైలు శిక్ష పడిన నోబెల్ గ్రహీత నర్గీస్ మహమ్మదీ సహా పలువురు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
Read Also: Noida Fire : నోయిడా మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యం కాగా.. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలను పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలీలీ 38.6 శాతం ఓట్లు సాధించారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్కు అర్హత సాధించారు. ఈ క్రమంలో మసౌద్ పెజెష్కియాన్, సయూద్ జలీలీలమాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించే బాధ్యత ఆ దేశ హోంమంత్రి అహ్మద్ వహీద్పై ఉంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభం కాగా.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఓటేసిన అయతుల్లా అలీ ఖమేనీ
దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ తన నివాసంలో ఓటు వేశారు. “ప్రజలు మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారని నేను తెలుసుకున్నాను. ప్రజలు ఓటు వేసి ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవాలి.” అయితే, గత వారం ఓటు వేయని వారు దేశంలోని షియా మతతత్వానికి వ్యతిరేకం కాదని అయతుల్లా అలీ ఖమేనీ బుధవారం అన్నారు. ఇదిలా ఉండగా.. జలీలీ గెలిస్తే ఇరాన్లో తాలిబాన్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తారని పెజెష్కియాన్ మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు. పెజెష్కియాన్ భయాన్ని వ్యాప్తి చేస్తున్నాడని జలీలీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!