Iran: హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నందుకు తొలి మరణశిక్ష విధించిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Issues 1st Death Sentence Linked To Anti-Hijab Riots: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో అట్టుడుకుతోంది. 22 ఏళ్ల మహ్స అమిని అనే మహిళను హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 16న ఆమె చనిపోయింది. దీంతో అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారు. ఇందులో 40 మంది వరకు భద్రత సిబ్బంది ఉన్నారు.
Read Also: G20 summit: నేటి నుంచి జీ 20 సమావేశాలు.. ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని మోదీ
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
గత రెండు నెలలుగా ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుతున్నాయి. కొన్ని వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా మతాధికారుల పాలన అంతం కావాలని చెబుతూ.. యువత, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొనందుకు తొలిసారిగా ఇరాన్ కోర్టు ఒకరికి మరణ శిక్ష విధించింది. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టడం, ప్రజాశాంతికి భంగం కలిగించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకంగా పాల్గొన్న నేరాల కింద ఇరాన్ రివిల్యూషనరీ గార్డ్ కోర్టు మరణ శిక్ష విధించింది. దేవుడికి శతృవు, దేశంలో అవినీతి వంటి నేరాల కింద శిక్షను విధించింది. మరో ఐదుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
దోషులు అంతా తమ శిక్షలపై అప్పీలు చేసుకోవచ్చని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ చట్టాల ప్రకారం అక్కడ శిక్షలు దారుణంగా ఉంటాయి. దైవ దూషణతో పాటు మహిళలు హిజాబ్ ధరించకున్నా, దొంగతనం, హత్యలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. కన్నుకు కన్ను అనే రీతిలో అక్కడి ప్రభుత్వం శిక్షను అమలు చేస్తుంది. ఇప్పటి వరకు యాంటీ హిజాబ్ అల్లర్లలో మూడు ప్రావిన్సుల్లో కలిపి 2000 మందికి పైగా అభియోగాలు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?