Iran: హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నందుకు తొలి మరణశిక్ష విధించిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Issues 1st Death Sentence Linked To Anti-Hijab Riots: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో అట్టుడుకుతోంది. 22 ఏళ్ల మహ్స అమిని అనే మహిళను హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 16న ఆమె చనిపోయింది. దీంతో అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారు. ఇందులో 40 మంది వరకు భద్రత సిబ్బంది ఉన్నారు.
Read Also: G20 summit: నేటి నుంచి జీ 20 సమావేశాలు.. ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని మోదీ
Also Read
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
గత రెండు నెలలుగా ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుతున్నాయి. కొన్ని వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా మతాధికారుల పాలన అంతం కావాలని చెబుతూ.. యువత, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొనందుకు తొలిసారిగా ఇరాన్ కోర్టు ఒకరికి మరణ శిక్ష విధించింది. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టడం, ప్రజాశాంతికి భంగం కలిగించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకంగా పాల్గొన్న నేరాల కింద ఇరాన్ రివిల్యూషనరీ గార్డ్ కోర్టు మరణ శిక్ష విధించింది. దేవుడికి శతృవు, దేశంలో అవినీతి వంటి నేరాల కింద శిక్షను విధించింది. మరో ఐదుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
దోషులు అంతా తమ శిక్షలపై అప్పీలు చేసుకోవచ్చని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ చట్టాల ప్రకారం అక్కడ శిక్షలు దారుణంగా ఉంటాయి. దైవ దూషణతో పాటు మహిళలు హిజాబ్ ధరించకున్నా, దొంగతనం, హత్యలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. కన్నుకు కన్ను అనే రీతిలో అక్కడి ప్రభుత్వం శిక్షను అమలు చేస్తుంది. ఇప్పటి వరకు యాంటీ హిజాబ్ అల్లర్లలో మూడు ప్రావిన్సుల్లో కలిపి 2000 మందికి పైగా అభియోగాలు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!