Iran: హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నందుకు తొలి మరణశిక్ష విధించిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Issues 1st Death Sentence Linked To Anti-Hijab Riots: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో అట్టుడుకుతోంది. 22 ఏళ్ల మహ్స అమిని అనే మహిళను హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 16న ఆమె చనిపోయింది. దీంతో అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారు. ఇందులో 40 మంది వరకు భద్రత సిబ్బంది ఉన్నారు.
Read Also: G20 summit: నేటి నుంచి జీ 20 సమావేశాలు.. ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని మోదీ
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
గత రెండు నెలలుగా ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుతున్నాయి. కొన్ని వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా మతాధికారుల పాలన అంతం కావాలని చెబుతూ.. యువత, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొనందుకు తొలిసారిగా ఇరాన్ కోర్టు ఒకరికి మరణ శిక్ష విధించింది. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టడం, ప్రజాశాంతికి భంగం కలిగించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకంగా పాల్గొన్న నేరాల కింద ఇరాన్ రివిల్యూషనరీ గార్డ్ కోర్టు మరణ శిక్ష విధించింది. దేవుడికి శతృవు, దేశంలో అవినీతి వంటి నేరాల కింద శిక్షను విధించింది. మరో ఐదుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
దోషులు అంతా తమ శిక్షలపై అప్పీలు చేసుకోవచ్చని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ చట్టాల ప్రకారం అక్కడ శిక్షలు దారుణంగా ఉంటాయి. దైవ దూషణతో పాటు మహిళలు హిజాబ్ ధరించకున్నా, దొంగతనం, హత్యలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. కన్నుకు కన్ను అనే రీతిలో అక్కడి ప్రభుత్వం శిక్షను అమలు చేస్తుంది. ఇప్పటి వరకు యాంటీ హిజాబ్ అల్లర్లలో మూడు ప్రావిన్సుల్లో కలిపి 2000 మందికి పైగా అభియోగాలు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!