Iran: ఇండియాకి వస్తున్న ట్యాంకర్పై దాడితో మాకు సంబంధం లేదు.. అమెరికా ఆరోపణలపై ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇటీవల అరేబియా సముద్రంలో భారత్ వైపు వస్తున్న కెమికల్ ట్యాంకర్ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎర్రసముద్రంలో భారత్కి వస్తున్న ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ అటాక్ జరిగింది. అయితే భారత్ సమీపంలో అరేబియా సముద్రంలో జరిగిన దాడి ఇరాన్ పనే అని అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్ని ‘విలువ లేనివి’గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. పెంటగాన్ ఆరోపించిన తర్వాత టెహ్రాన్ నుంచి ఈ తరహా ప్రతిస్పందన వచ్చింది.
అమెరికా వాదనల్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని, విలువలేనివిగా ప్రకటిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనాని అన్నారు. ఇటువంటి వాదనలతో గాజాలో నియోనిస్టు పాలన(ఇజ్రాయిల్) నేరాలను అమెరికన్ ప్రభుత్వం కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఇరాన్ చెప్పింది.
Also Read
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
Read Also: Salaar 3 Days Collections: 3 రోజులు- 402 కోట్లు.. సలారోడు దిగితే ఇలానే ఉంటది!
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్కి మద్దతుగా యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. అయితే ఈ హౌతీలకు ఇరాన్ మద్దతు ఉందని అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని దేశాల నౌకా సంస్థలు రెడ్ సీ, సూయజ్ కెనాల్ ద్వారా రాకపోకలను రద్దు చేసుకుంటున్నాయి. యూరప్ నుంచి ఆసియాకు వెళ్లేందుకు ఆఫ్రికా ఖండాన్ని చుట్టివస్తున్నాయి.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 240 మందిని బందీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాను టార్గెట్ చేసి టార్గెట్ చేస్తోంది. ఈ దాడిలో ఇప్పటి వరకు 20,400 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ పూర్తిగా నేలమట్టం అయ్యేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని జెంజమన్ నెతన్యాహూ చెప్పారు.
తాజావార్తలు
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?