Nawaz Sharif: పాకిస్తాన్ ఆర్థిక పతనానికి కారణం భారత్ కాదు, మనమే.. మాజీ పీఎం కీలక వ్యాఖ్యలు..
Nawaz Sharif: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. అప్పు కోసం ప్రపంచదేశాలను, ఐఎంఎఫ్ చుట్టూ తిరుగుతోంది. ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు విద్యుత్, గ్యాస్, ఇంధన రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో వచ్చ ఏడాది పాకిస్తాన్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలతో ఇప్పటికే జైలులో ఉండగా.. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే నవాజ్ షరీఫ్ భారత్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్థిక కష్టాలకు భారత్, అమెరికా కారణం కాదని, మనమే అని అన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ వాఖ్యలు చేశారు. 1993,1999,2017లో ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్, ప్రస్తుతం మరోసారి ప్రధాని కావాలని అనుకుంటున్నాడు.
Also Read
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
- US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
- UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
- Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
Read Also: Italy: పెళ్లికి నిరాకరించిందని కూతురిని చంపిన పాక్ దంపతులు.. జీవిత ఖైదు విధించిన ఇటలీ కోర్టు
‘‘ ఈ రోజు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితికి భారత్, యూఎస్, ఆఫ్ఘనిస్తాన్ కారణం కాదు. వాస్తవానికి మనల్ని మనమే తగలబెట్టుకున్నాము. 2018లో వారు(పాక్ సైన్యం) రిగ్గించే చేయడం ద్వారా దేశంలో ఎంపిక చేసిన ప్రభుత్వం వల్ల ప్రజల కష్టాలకు, ఆర్థిక వ్యవస్థ పతనానికి దారి తీసింది’’ అని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు, వారికి(పాక్ సైన్యానికి) రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పటికీ, చట్టబద్ధత కల్పిస్తారని న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు. ఇటీవల భారత్ దేశంలో తాను సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అనుకున్నట్లు.. 1999 కార్గిల్ యుద్ధం తనకు తెలియకుండా జరిగిందని నవాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. తన హాయాంలో భారత ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయ్, నరేంద్రమోడీలు పాకిస్తాన్ సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!