WHO: చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందులపై చర్యలు తీసుకోవాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Under Scrutiny As WHO Looks At Cough Syrup Deaths: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విచారణ చేపట్టింది. సంబంధిత దేశాలు చర్యలు తీసుకోవాలని కోరింది. భారతదేశం, ఇండోనేషియాలో తయారైన దగ్గుమందుల వల్ల మూడు దేశాల్లో 300 మందికి పైగా పిల్లలు మరణించారు. గాంబియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా దేశాల్లో పిల్లల మరణాలు నమోదు అయ్యాయి. భారతదేశం, ఇండోనేషియాలో తయారైన ఆరు ఔషధ కంపెనీలో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ కంపెనీలకు ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో డబ్ల్యూహెచ్ఓ ఎంక్వైరీ సాగనుంది.
Read Also: Asia Cup: ఆసియా కప్ కోసం పాకిస్తాన్కు టీమిండియా వెళ్తుందా?.. ఆరోజు క్లారిటీ
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ఆఫ్రికా దేశం అయిన గాంబియాలో పిల్లల చావులతో ఈ దగ్గుమందు విషాదం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఇలాగే ఉజ్బెకిస్తాన్ లో కూడా ఇలాగే జరిగింది. వీటి వెనక భారత కంపెనీలు తయారు చేసిన కాఫ్ సిరప్ ఉన్నాయని ఆయా దేశాలు ఆరోపించాయి. వీటి అమ్మకాలను నిషేధించాయి. ఈ సిరప్ వాడిన తర్వాత పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీసింది. జూలై 2022లో గాంబియాలో మొదటగా మరణాలు ప్రారంభం అయ్యాయి. పిల్లలు సాధారణం జబ్బుల కోసం తీసుకునే ఓవర్-ది-కౌంటర్ దగ్గు మందుతో మరణాలు ముడిపడి ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ మందుల్లో డైథైలిన్ గ్లైకాల్/ ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపదార్థం మోతాదుకు మించి ఉందని పరీక్షల్లో తేలింది.
కాంబోడియా, ఫిలిప్పీన్స్, తూర్పు తైమూర్, సెనెగల్ నాలుగు దేశాలకు ఈ విచారణను విస్తరించినట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. నాసిరకం మందులు నిర్మూలించేందుకు, నియంత్రించేందుకు తనిఖీలు ప్రారంభించాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రపంచ ఔషధ పరిశ్రమ పిలుపునిచ్చింది. భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్, మారియన్ బయోటెక్ కంపెనీలు మరణాలనతో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు కంపెనీలను మూతపడ్డాయి. అయితే మైడెన్ ఉత్పత్తుల్లో ఎలాంటి సమస్యలు లేవని డిసెంబర్ నెలలో భారతప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియాకు చెందిన 4 ఔషధ కంపెనీలు తయారు చేసి దేశీయంగా విక్రయించే కంపెనీలపై హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!