UK-India: నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
- యూకేలో ప్రధాని మోడీ పర్యటన
- నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం బుధవారం లండన్ చేరుకున్నారు. గురువారం యూకేతో భారత్ కీలక ఒప్పందం జరగనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం, విద్య, భద్రత వంటి అంశాలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో మోడీ చర్చలు జరపనున్నారు. అనంతరం సంతకాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Rakul Preet : ఓ వైపు వర్షాలు.. రకుల్ అందాల సోయగాలు..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ప్రధాని మోడీతో వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ కూడా ఉన్నారు. మూడు సంవత్సరాల చర్చల తర్వాత మే 6న రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు ప్రకటించాయి. 2030 నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేర్చే ప్రయత్నంలో బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా చేస్తూ…తోలు, పాదరక్షలు మరియు దుస్తులతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని వాణిజ్య ఒప్పందం జరిగింది.
ఇది కూడా చదవండి: HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..
రెండు దేశాల వాణిజ్య మంత్రులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే మోడీ మంత్రివర్గం ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అమల్లోకి రావడానికి ముందు బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది.
ఇక లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. కింగ్ చార్లెస్ను కలవనున్నారు. అనంతరం మాల్లీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మాల్దీవులు వెళ్తారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక మోడీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Touched by the warm welcome from the Indian community in the UK. Their affection and passion towards India’s progress is truly heartening. pic.twitter.com/YRdLcNTWSS
— Narendra Modi (@narendramodi) July 23, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!