UK-India: నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
- యూకేలో ప్రధాని మోడీ పర్యటన
- నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం బుధవారం లండన్ చేరుకున్నారు. గురువారం యూకేతో భారత్ కీలక ఒప్పందం జరగనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం, విద్య, భద్రత వంటి అంశాలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో మోడీ చర్చలు జరపనున్నారు. అనంతరం సంతకాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Rakul Preet : ఓ వైపు వర్షాలు.. రకుల్ అందాల సోయగాలు..
Also Read
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
ప్రధాని మోడీతో వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ కూడా ఉన్నారు. మూడు సంవత్సరాల చర్చల తర్వాత మే 6న రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు ప్రకటించాయి. 2030 నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేర్చే ప్రయత్నంలో బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా చేస్తూ…తోలు, పాదరక్షలు మరియు దుస్తులతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని వాణిజ్య ఒప్పందం జరిగింది.
ఇది కూడా చదవండి: HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..
రెండు దేశాల వాణిజ్య మంత్రులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే మోడీ మంత్రివర్గం ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అమల్లోకి రావడానికి ముందు బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది.
ఇక లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. కింగ్ చార్లెస్ను కలవనున్నారు. అనంతరం మాల్లీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మాల్దీవులు వెళ్తారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక మోడీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Touched by the warm welcome from the Indian community in the UK. Their affection and passion towards India’s progress is truly heartening. pic.twitter.com/YRdLcNTWSS
— Narendra Modi (@narendramodi) July 23, 2025
తాజావార్తలు
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!