S Jaishankar: ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు
India strong Reply After Pak Raises Kashmir At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ మరోసారి తన పరువును తీసుకుంది. భద్రతా మండలిలో ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అయితే దీనికి ఘాటుగా స్పందించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని భద్రతా మండలిలో ఎత్తి చూపుతూ.. ఘాటు విమర్శలు చేశారు. బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇవ్వడంతో పాటు పొరుగును ఉన్న పార్లమెంట్ పై దాడికి తెగబడిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని జైశంకర్ పాకిస్తాన్ తీరును విమర్శించారు.
Read Also: FIFA World Cup: ఫైనల్స్కు చేరిన ఫ్రాన్స్.. సెమీస్లో మొరాకో చిత్తు
Also Read
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ తన మిత్రదేశం అయిన పాకిస్తాన్ ను కాపాడుతూ వస్తున్న చైనా తీరును కూడా జైశంకర్ ఎండగట్టారు. భద్రతా మండలి ఆంక్షల కమిటిలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను కాపాడుతూ వస్తోంది. దీనిపై కూడా చైనా తీరును కూడా పరోక్షంగా విమర్శించారు. అత్యంత శక్తివంతమైన 15 దేశాల భద్రతా మండలి సమావేశాలు భారత్ అధ్యక్షతన జరిగాయి. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మహమ్మారి, ఉగ్రవాదం, వాతావారణ మార్పు కీలక సవాళ్లపై పనిచేయడంపై ఐక్యరాజ్యసమితి విశ్వనీయత ఆధారపడి ఉందని అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయని.. పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని, ఆర్టికల్ 370, 35ఏని రద్దు చేసిన తర్వాత భారత్-పాక్ సంబంధాలు ఎప్పుడూ లేనంతగా క్షీణించాయి. దీంతో పాకిస్తాన్ పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో ఏ అంశంపై చర్చ జరిగినా.. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. కాశ్మీర్ మాట ఎత్తినప్పుడల్లా భారత్, పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం ఇస్తోంది. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత విషయం అని పలు వేదికలపై భారత్ పదేపదే చెబుతోంది. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్ తో సంబంధాలు ఉంటాయని భారత్ చెబుతోంది.
తాజావార్తలు
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో