Justin Trudeau: భారత అణిచివేతతో ఇరు దేశాల ప్రజలకు ఇబ్బందులు.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: కెనడా, ఇండియాల మధ్య దౌత్య వివాదం తీవ్రమవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్యవేత్తలపై భారత ప్రభుత్వం అణిచివేతతో రెండు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తోందని ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు.
41 మంది దౌత్యవేత్తల హోదాను ఏకపక్షంగా తీసేస్తామని భారత్ హెచ్చరించడంతో కెనడా తన దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత రోజు ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ప్రభుత్వం భారతదేశం, కెనడాల్లో లక్షలాది మంది ప్రజల జీవనాన్ని యధావిధిగా కొనసాగించడాన్ని నమ్మలేనంత కష్టతరం చేస్తోంది, దౌత్యం యొక్క ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రూడో అన్నారు.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
Read Also: Kerala High Court: మహిళలు తమ తల్లి లేదా అత్తగారికి బానిసలు కాదు.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఒంటారియోలోని బ్రాంఫ్టన్ లో టెలివిజన్ మీడియా సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించడం వల్ల ప్రయాణ, వాణిజ్యానికి ఆటంకం కలుగుతుందని, కెనడాలో చదువుతున్న భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతాయని ట్రూడో చెప్పారు. రెండు మిలియన్ల కెనడియన్లు, మొత్తం జనాభాలో 5 శాతం మంది భారతీయ వారసత్వాన్ని కలిగి ఉాన్నారు. విదేశాలకు చదువుకోవడానికి వెళ్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది కెనడాలోనే చదువుకుంటున్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్య చేయబడ్డాడు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని భారత్ ఖండించడమే కాకుండా, ఆధారాలు చూపాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఇదే విధంగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
ఇటీవల కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. అక్టోబర్ 10లోపు వారు వెళ్లకుంటే, దౌత్య పరమైన రక్షణను రద్దు చేస్తామని ప్రకటించింది. రెండు దేశాలు పరస్పర దౌత్యపరమైన ఉనికిలో సమానత్వాన్ని కోరుతున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో ఇప్పుడు కెనడాలో, ఇండియాలో 21 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. అయితే ఇది వియన్నా దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమే అని కెనడా ఆరోపించింది. దీనికి భారత్ ధీటుగానే స్పందిస్తూ.. సమానత్వాన్ని నిబంధనలు ఉల్లంఘించడంగా చెప్పొద్దు అని హితవు పలికింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!