Drone Attack: రెడ్ సీలో ఇండియా ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి.. రెండు రోజుల్లో రెండో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Attack: రెడ్ సీ(ఎర్ర సముద్రం)లో భారత్కి వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ నౌకపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి జరిపారు. ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్పై డ్రోన్ అటాక్ జరిగినట్లు అమెరికా మిలిటరీ ఈ రోజు వెల్లడించింది. ఎంవీ సాయిబాబా అనే ట్యాంకర్, గబన్ జెండాతో ఉంది. ఈ నౌకలో మొత్తం 25 మంది భారత సిబ్బంది ఉన్నారు. దాడిలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడి జరిగిన తర్వాత యూఎస్ నౌకకు ఎంవీ సాయిబాబ నుంచి డిస్ట్రెస్ కాల్ వెళ్లినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ట్వీట్ చేసింది.
ఎర్ర సముద్రంలో భారత్ వస్తున్న నౌకతో పాటు మరో నౌక తాము దాడికి గురవుతున్నట్లు యూఎస్ నౌకదళ షిప్కి సమాచారం అందించాయి. భారత్ వస్తున్న నౌకతో పాటు ఎంవీ బ్లామనెన్ అనే నార్వే జెండా కలిగిన కెమికల్ ట్యాంకర్ నౌకపై కూడా హౌతీ డ్రోన్ దాడి జరిపింది. అయితే ఈ దాడి మిస్ అయినట్లు యూఎస్ మిలిటరీ తెలిపింది.
Also Read
- SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
- Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
Read Also: CM Revanth Reddy: ఆరు గ్యారంటీలు అమలవ్వాలంటే అధికారులు జోడెద్దుల్లా పని చేయాలి
అంతకుముందు రోజు ఇండియా వైపు వస్తున్న నౌకపై అరేబియా సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్ దీనిపై దాడి చేసిందని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. దాదాపు 20 మంది భారతీయ సిబ్బందితో కూడిన MV కెమ్ ప్లూటో, ముడి చమురుతో ఇండియాకు వస్తున్న క్రమంలో గుజరాత్ లోని వెరావల్కి నైరుతి దిశలో 200 నాటికన్ మైళ్ల దూరంలో దాడికి గురైంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యలో యెమెన్ లోని హౌతీ తిరుగుబాటు దాడులు రెడ్ సీ నుంచి వచ్చి వెళ్లే ట్యాంకర్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న, ఇజ్రాయిల్ కి చెందిన నౌకలపై దాడులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!