India and China Troops Clash: భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్.. జవాళ్లకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. అరుణాచల్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో రెండు దేశాలకు చెందిన దళాలు ఘర్షణ పడ్డాయి, ఇరుపక్షాలు విడిపోయాయి ముఖాముఖి తలపడ్డారు.. ఈ ఘర్షణలో రెండు వైపుల నుండి కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.. డిసెంబరు 9న జరిగిన ఈ ఘర్షణలో డ్రాగన్ కంట్రీతో పాటు భారత సైనికులు కూడా కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత ఇరు పక్షాలు వెంటనే విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది.. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఎదురుకాల్పులు జరిగాయి. చైనీస్ దళాలు ఎల్ఏసీని దాటాయి.. ఈ చర్యను భారత సైనికులు తిప్పికొట్టినట్టు చెబుతున్నారు.. తూర్పు లడఖ్లో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడం ఇదే తొలిసారి.
Read Also: Cyber Crime: కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్.. విద్యార్థిని నుంచి లక్షలు దోచేశారు..!
Also Read
2020 జూన్లో గాల్వాన్ లోయలో అత్యంత ఘోరమైన ఘర్షణలు జరిగాయి. 20 మంది భారతీయ సైనికులు మరణించారు.. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు లేదా గాయపడ్డారనే వార్తలు కూడా వచ్చిన విషయం విదితమే. ఈ సంఘటన పాంగోంగ్ సరస్సు యొక్క సౌత్ బ్యాంక్లో రెండు దేశాల మధ్య వరుస ఘర్షణలకు దారితీసింది. మిలిటరీ కమాండర్ల మధ్య పలు సమావేశాల తరువాత, లడఖ్లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్తో సహా కీలకమైన పాయింట్ల నుండి భారత మరియు చైనా దళాలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, సరిహద్దు గురించిన భిన్నమైన వాదనల కారణంగా 2006 నుండి ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. కాగా, అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ ప్రాంతంలో డిసెంబరు 9న భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సుమారు 17,000 అడుగుల ఎత్తున ఉన్న శిఖరాన్ని స్వాధీనం చేసుకునేందుకు చైనాకు చెందిన సుమారు 300 మంది సైనికులు ప్రయత్నించారని, వారిని భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారని తెలుస్తోంది. వాస్తవాధీన రేఖను చైనా ఉల్లంఘించిందని భారత్ చెబుతోంది.. వ్యూహాత్మకంగా కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!