India and China Troops Clash: భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్.. జవాళ్లకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. అరుణాచల్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో రెండు దేశాలకు చెందిన దళాలు ఘర్షణ పడ్డాయి, ఇరుపక్షాలు విడిపోయాయి ముఖాముఖి తలపడ్డారు.. ఈ ఘర్షణలో రెండు వైపుల నుండి కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.. డిసెంబరు 9న జరిగిన ఈ ఘర్షణలో డ్రాగన్ కంట్రీతో పాటు భారత సైనికులు కూడా కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత ఇరు పక్షాలు వెంటనే విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది.. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఎదురుకాల్పులు జరిగాయి. చైనీస్ దళాలు ఎల్ఏసీని దాటాయి.. ఈ చర్యను భారత సైనికులు తిప్పికొట్టినట్టు చెబుతున్నారు.. తూర్పు లడఖ్లో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడం ఇదే తొలిసారి.
Read Also: Cyber Crime: కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్.. విద్యార్థిని నుంచి లక్షలు దోచేశారు..!
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
2020 జూన్లో గాల్వాన్ లోయలో అత్యంత ఘోరమైన ఘర్షణలు జరిగాయి. 20 మంది భారతీయ సైనికులు మరణించారు.. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు లేదా గాయపడ్డారనే వార్తలు కూడా వచ్చిన విషయం విదితమే. ఈ సంఘటన పాంగోంగ్ సరస్సు యొక్క సౌత్ బ్యాంక్లో రెండు దేశాల మధ్య వరుస ఘర్షణలకు దారితీసింది. మిలిటరీ కమాండర్ల మధ్య పలు సమావేశాల తరువాత, లడఖ్లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్తో సహా కీలకమైన పాయింట్ల నుండి భారత మరియు చైనా దళాలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, సరిహద్దు గురించిన భిన్నమైన వాదనల కారణంగా 2006 నుండి ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. కాగా, అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ ప్రాంతంలో డిసెంబరు 9న భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సుమారు 17,000 అడుగుల ఎత్తున ఉన్న శిఖరాన్ని స్వాధీనం చేసుకునేందుకు చైనాకు చెందిన సుమారు 300 మంది సైనికులు ప్రయత్నించారని, వారిని భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారని తెలుస్తోంది. వాస్తవాధీన రేఖను చైనా ఉల్లంఘించిందని భారత్ చెబుతోంది.. వ్యూహాత్మకంగా కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!