Imran Khan: నాపై మూడోసారి హత్యాయత్నం జరగబోతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. రాజకీయంగా కూడా పతనావస్థలో ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, అక్కడి షహజాబ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరోవైపు సైన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు తీవ్ర ఒత్తడిలో ఉన్నాయి. దీనికి తోడు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరగడం పాకిస్తాన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుపుతోంది.
Read Also: USCIRF: భారత్లో మతస్వేచ్ఛ లేదు, ఆంక్షలు విధించాలి.. ఇండియా స్ట్రాంగ్ రిప్లై
Also Read
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
ఇదిలా ఉంటే మరోసారి ఇమ్రాన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మూడోసారి హత్యాయత్నం జరిగినట్లు లాహోర్ హైకోర్టులో తెలియజేశారు. తనపై ఉన్న అన్ని రాజకీయ కేసులను రద్దు చేయాలని కోరుతున్నారని, రెగ్యులర్ కోర్టుకు హాజరుకావడం తన ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని కోర్టుకు తెలిపారు. దేశద్రోహం, దైవదూషణ, హింస మరియు ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి వివిధ ఆరోపణలపై దేశంలోని వివిధ నగరాల్లో తనపై నమోదైన మొత్తం 121 కేసులను రద్దు చేయాలని కోర్టును కోరారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చైర్మన్, మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ కోర్టులో మాట్లాడుతూ.. కోర్టుకు రెగ్యులర్ గా హాజరుకావడం వల్ల నా ప్రాణాలకు ప్రమాదం ఉందని, నేను ఇప్పటికే రెండు హత్యాయత్నాల నుంచి బయటపడ్డాలని, పంజాబ్ లోని వజీరాబాద్ లో, ఇస్లామాబాద్ లోని జ్యుడిషియన్ కాంప్లెక్ వద్ద, తనపై హత్య యత్నం జరిగిందని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్న వారు తనను చంపాలని అనుకుంటున్నారని, తనపై మూడోసారి హత్యాయత్నం జరగబోతోందని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ లో పంజాబ్ లోని వజీరాబాద్ ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ పై తుపాకీతో దాడి జరిగింది. అతని కాలికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ దాడికి ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు హోంమంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ అధికారి మేజర్ జనలర్ ఫైసల్ నసీర్ కారణం అని ఆరోపించాడు.
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!