Israel: ఇరాన్ అణు విద్యుత్ సమీప నగరాలు ఖాళీ చేయాలన్న ఐడీఎఫ్.. నిలిచిన ఇంటర్నెట్ సేవలు
- ఇరాన్ అణు విద్యుత్ సమీప నగరాలు ఖాళీ చేయాలన్న ఐడీఎఫ్
- దాడులకు రంగం సిద్ధం చేసుకుంటున్న అమెరికా
- ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన ఇరాన్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. క్షిపణుల ప్రయోగాలతో ఇరు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగర నివాసితులంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. ఇరాన్లోని అరక్, ఖోండాబ్ నగర ప్రజలకు ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. సొంత భద్రత కోసం ఆ ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరింది. ఫార్సీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఐడీఎఫ్ తెలిపింది. ఇరానియన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Oneplus Store : గిట్లకూడ ఉంటదా..? రిపేర్కు ఇచ్చిన ఫోన్ తిరిగివ్వమంటే కస్టమర్లకు బెదరింపులు..
Also Read
- Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ఇదిలా ఉంటే ఈ వారాంతంలోనే అమెరికా కూడా ఇరాన్పై దాడులకు దిగొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు కూడా ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదిక పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇరాన్పై అమెరికా విరుచుకుపడొచ్చని తెలిపింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీప నగరాలను ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేయమని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Space x: టెస్టింగ్ సమయంలోనే పేలిపోయిన స్పేస్ఎక్స్ స్టార్షిప్
ప్రస్తుతం ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో ఇరాన్ ప్రభుత్వం సేవలను నిలిపివేసింది. దీంతో దాదాపుగా 12 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు అందడం లేదు.
ఇక తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లో పెద్ద ఆస్పత్రి ధ్వంసం అయింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
-
Triumph Bonneville T120: భారత్లో లాంచ్ అయిన ట్రయంఫ్ బోనేవిల్ T120.. రెట్రో డిజైన్ ధర, ఫీచర్లు ఇవే
-
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
-
Peddi: భోపాల్లో ‘పెద్ది’ ఆడియో లాంచ్పై భారీ ప్లాన్..ఈవెంట్కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
-
Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!