Sundar pichai: డాక్టరేట్ పట్టా అందుకున్న గూగుల్ సీఈవో
- డాక్టరేట్ పట్టా అందుకున్న గూగుల్ సీఈవో
- తన తల్లిదండ్రుల ఆశ నెరవేరిందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన తల్లిదండ్రుల కోర్కెను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నెరవేర్చారు. తమ కుమారుడు పీహెచ్డీ పట్టా అందుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశించారు. వారు కోరుకున్నట్టుగానే కొడుకు దాన్ని సాధించి తీసుకొచ్చాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. ఈ మేరకు ఇన్స్ట్రాగామ్లో ఫొటోను గూగుల్ సీఈవో పంచుకున్నారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. డాక్టర్ ఆఫ్ సైన్స్ (Honoris Causa) లభించగా, అతని భార్య అంజలి పిచాయ్ కెమికల్ ఇంజనీరింగ్లో పూర్వ విద్యార్థిగా అవార్డును అందుకున్నారు. క్యాంపస్లో క్లాస్మేట్గా ఉన్న అంజలిని పిచాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Also Read
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సెక్రటేరియట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
పిచాయ్.. పీహెచ్డీ చేయాలని అతని తల్లిదండ్రులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఈ స్థితికి చేరుకోవడానికి సహాయం చేసిన ఇన్స్టిట్యూట్కు సుందర్ పిచాయ్ కృతజ్ఞతలు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమానికి ఐఐటీ ఖరగ్పూర్ డైరెక్టర్ వీకే తివారితో పాటు సుందర్ పిచాయ్ తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: బస్ డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని రక్షించి ప్రాణాలు వదిలిన డ్రైవర్
పిచాయ్.. ఐఐటీ నుంచి మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్లో B.Tech పూర్తి చేశారు. తర్వాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్లో ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. 2004లో గూగుల్లో చేరారు. ఈ సమయంలో క్యాంపస్లో తన క్లాస్మేట్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తాజావార్తలు
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
-
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!