Tamil Nadu: బస్ డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని రక్షించి ప్రాణాలు వదిలిన డ్రైవర్
- స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు
- బస్సును పక్కన ఆపి 20 మంది పిల్లలను కాపాడిన డ్రైవర్
- అనంతరం ప్రాణాలు వదిలిని బస్సు డ్రైవర్
- తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో గుండెపోటు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. అప్పటి వరకే బాగానే ఉంటూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతోంది. ఇదిలా ఉంటే.. తమిళనాడులో స్కూల్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో చనిపోయి.. మరో 20 విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు.
CM Revanth Reddy: సెక్రటేరియట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Also Read
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. తాను చనిపోయే ముందు డ్రైవర్ చేసిన ఈ పనికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ సంఘటన జూలై 24 బుధవారం రోజున జరిగింది. వెల్లకోయిల్లోని ANV మెట్రిక్ స్కూల్ నుండి విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపడానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఛాతిలో నొప్పి రావడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపాడు. అయితే.. అతని భార్య కూడా అదే స్కూల్లో హెల్పర్గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.
మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు కొనియాడారు. “తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము.” అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించగా.. మంత్రి ఎంపీ సామినాథన్ మృతుడి కుటుంబానికి చెక్కును అందజేశారు. మరోవైపు.. బస్సు డ్రైవర్కు శుక్రవారం ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..