Tamil Nadu: బస్ డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని రక్షించి ప్రాణాలు వదిలిన డ్రైవర్
- స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు
- బస్సును పక్కన ఆపి 20 మంది పిల్లలను కాపాడిన డ్రైవర్
- అనంతరం ప్రాణాలు వదిలిని బస్సు డ్రైవర్
- తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో గుండెపోటు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. అప్పటి వరకే బాగానే ఉంటూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతోంది. ఇదిలా ఉంటే.. తమిళనాడులో స్కూల్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో చనిపోయి.. మరో 20 విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు.
CM Revanth Reddy: సెక్రటేరియట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Also Read
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. తాను చనిపోయే ముందు డ్రైవర్ చేసిన ఈ పనికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ సంఘటన జూలై 24 బుధవారం రోజున జరిగింది. వెల్లకోయిల్లోని ANV మెట్రిక్ స్కూల్ నుండి విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపడానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఛాతిలో నొప్పి రావడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపాడు. అయితే.. అతని భార్య కూడా అదే స్కూల్లో హెల్పర్గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.
మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు కొనియాడారు. “తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము.” అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించగా.. మంత్రి ఎంపీ సామినాథన్ మృతుడి కుటుంబానికి చెక్కును అందజేశారు. మరోవైపు.. బస్సు డ్రైవర్కు శుక్రవారం ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.
తాజావార్తలు
-
OTR: ఈటల-కేటీఆర్ బంధం ఇంకా అలాగే ఉందా? పెళ్లి వేడుకలో ఆసక్తికర సన్నివేశం!
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!