CM Revanth Reddy: సెక్రటేరియట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- ధరణిలో సమస్యలు..మార్పులు-చేర్పులు..ఇతర అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్నారు.
Also Read
ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూసమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ధరణిలో 35 లావాదేవీల మాడ్యూళ్లు, 10 సమాచార మాడ్యూళ్లతో క్షేత్రస్థాయిలో సమస్యలకు కొంత పరిష్కారం చూపించామని వివరించారు. సాక్షాత్తు హైకోర్టు ధరణిలోని ఎన్నో లోపాలను ఎత్తిచూపిందని భట్టి విమర్శించారు. ధరణి కమిటి తుది నివేదిక ఆధారంగా సమస్యలను పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!