Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. షాప్ ఓపెన్ తర్వాత 30 నిమిషాల్లోనే లూటీ.. వీడియో వైరల్..
- పాకిస్తాన్లో అరగంటలోనే దుకాణం లూటీ..
- షాప్ ప్రారంభించిన అరగంటనే ఖాళీ చేసిన ప్రజలు..
- కరాచీలో ఘటన.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ద్రవ్యోల్భణం పెరగడంతో ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు ధరలకు దొరకడం లేదు. అయితే, తాజాగా కరాచీలో ఓ షాప్ ప్రారంభించిన 30 నిమిషాల్లోనే ప్రజలు లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతోంది. దీనిని బట్టి చూస్తే ఆ దేశం, అక్కడి ప్రజలు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
కరాచీలో శుక్రవారం డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగాల్సింది, అయితే షాప్ ఒపెనింగ్ అంతలోనే గందరగోళంగా మారింది. తక్కువ ధరలకే వస్తువులు వస్తాయని షాప్ యాజమాన్యం ప్రకటనలతో అదరగొట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓపెనింగ్కి హాజరయ్యారు. పాకిస్తాన్ మొట్టమొదటి మెగా పొదుపు దుకాణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ఈవెంట్ దుస్తులు, ఉపకరణాలు మరియు గృహోపకరణాలపై తక్కువ ధరలకే ఇస్తామని వాగ్దానం చేసింది. మాల్ వెలుపల వేలాది మంది ప్రజలు గుమిగూడడంతో, వారిని నియంత్రించడానికి నిర్వాహకులు కష్టపడ్డారు.
పరిస్థితిని గమనించి షాప్ని మూసేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంతో, షాపు అద్దాలు పగలగొట్టి గుంపు షాపులోకి ప్రవేశించింది. ఆ తర్వాత షాపులోని బట్టలును, వస్తువుల్ని లూటీ చేశారు. షాపు మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమైతే కేవలం అరగంటలోనే 3.30 గంటలకు మొత్తం ఖాళీ అయింది. అరగంటలోనే ప్రజలు షాపుని కొల్లగొట్టారు. ‘‘మేము కరాచీ ప్రజల ప్రయోజనం కోసం దీనిని తీసుకువచ్చామని, ఇప్పుడు పరిస్థితి ఇదని దాని ఉద్యోగి కన్నీటిపర్యంతమయ్యాడు. విదేశాల్లో ఉంటున్న ప్రవాస పాకిస్తానీ వ్యక్తి కరాచీలో ఈ మాల్ని ప్రారంభించారు. ఈ ఘటనపై పాక్ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడేందుకు ఇంత సంఖ్యలో ముందుకు వస్తే దేశం పరిస్థితి బాగుండేదని, కానీ దీనికి బదులుగా రూ. 50కి వచ్చే షర్టులకు ప్రాధాన్యత ఇచ్చారని ఎక్స్లో రాశారు.
https://twitter.com/Politicspedia23/status/1830115111102513395
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!