Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News From Nijjar To Shahid Latif Indias Enemies Fall One After Other On Foreign Soil

Terrorists: “నిజ్జర్ నుంచి లతీఫ్ వరకు”.. విదేశీ గడ్డ మీద ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం..

Published Date :October 11, 2023 , 8:30 pm
By BV Reddy
Terrorists: “నిజ్జర్ నుంచి లతీఫ్ వరకు”.. విదేశీ గడ్డ మీద ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Terrorists: విదేశీ గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉగ్రవాదులను పిట్టల్లా రాలిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ చనిపోయేది మాత్రం ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. తాజాగా 2016 పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ జైషే మహ్మద్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో బుధవారం హతమయ్యాడు. గుర్తుతెలియని దుండగులు లతీఫ్ ని కాల్చి చంపారు.

భారత వ్యతిరేక ఉగ్రవాదులకు ఇన్నాళ్లు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్‌లో ఇప్పుడు భయం మొదలైంది. బయటకు వెళ్లే ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు హతమైన ఉగ్రవాదులి లిస్టును పరిశీలిస్తే..

షాహీద్ లతీఫ్:

2016లో పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ఏడుగురు భారత వైమానిక దళ సిబ్బంది మరణించారు. ఈ దాడికి జైషే మహ్మద్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ కారణం. బుధవారం పాకిస్తాన్ లోని సియాల్ కోట్ జిల్లాలోని దస్కా పట్టణంలో మసీదు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

రియాజ్ అహ్మద్:

రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్. జనవరి 1న రాజౌరీలోని ధంగ్రీ గ్రామంలో ఉగ్రవాద దాడికి ప్రధాన కారకుడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇతడు సెప్టెంబర్ నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్ కోట్ లోని అల్-ఖుదుస్ మసీదులో కాల్చి చంపబడ్డాడు.

హర్దీప్ సింగ్ నిజ్జర్:

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కి ఇతను చీఫ్ గా ఉన్నాడు. యువకులకు శిక్షణ ఇవ్వడం, రిక్రూట్ చేయడం వంటివి చేస్తున్నాడు.

బషీర్ అహ్మద్ పీర్:

పాకిస్తాన్ రావల్పిండిలో బషీర్ అహ్మద్ పీర్ ని కాల్చి చంపారు. ఇతను హిజ్బుల్ ముజాహీదీన్ ఉగ్ర సంస్థ కమాండర్.జమ్మూ కాశ్మీర్ లోని పలు ఉగ్ర ఘటనల్లో ఇతని ప్రమేయం ఉంది.

సయ్యద్ ఖలీద్ రజా:

పాకిస్తాన్ లోని కరాచీలో కాల్చిచంపబడ్డాడు. అల్ బదర్స్ కమాండర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తలు కాల్చి చంపారు.

మిస్త్రీ జహుర్ ఇజ్రహీం:

ఇండియన్ ఎయిర్‌లైన్ ఐసీ 814 హైజాకర్లలో ఒకరైన మిస్త్రీ బహూర్ ఇబ్రహీంను పాకిస్తాన్ కరాచీలో బైక్ పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. డిసెంబర్ 24, 1999న ఖాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఇబ్రహీం కూడా ఉన్నాడు.

పరంజిత్ సింగ్ పంజ్వార్:

ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్) చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వార్ ని గుర్తు తెలియని వ్యక్తలు లాహోర్ లో హత్య చేశారు. హత్యలు, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కేసుల్లో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.

లాల్ మహ్మద్:

లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ దర్జీ పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్. ఇతడిని సెప్టెంబర్ 19న నేపాల్ రాజధాని ఖాట్మాండులో కాల్చిచంపారు. భారతదేశంలో నకిలీ నోట్ల సరఫరాలో కీలక సూత్రధారి.

తృటితో తప్పించుకున్న టెర్రరిస్టులు:

జమాద్ ఉద్ దవా, లష్కరే తోయిబా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీస్ సయీద్ 2021 జూన్ నెలలో లాహోర్ లోని తన ఇంటి వద్ద జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. పేలుడు సమయంలో సయీద్ ఇంట్లో లేడు. అతని కుమారుడు తల్హా సయీద్ 2019లో ఓ మతపరమైన కార్యక్రమంలో జరిగిన పేలుడు నుంచి తప్పించుకున్నాడు.

ఉరీ, పఠాన్ కోట్, పార్లమెంట్‌పై దాడిలో కీలక నిందితుడు జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ 2019 ఫిబ్రవరి నుంచి పెషావల్ లోని మదర్సాలో ఆశ్రయం పొందాడు. రెండు నెలల తర్వాత మసూద్ అజార్ ఆశ్రయం పొందిన చోట పేలుడు సంభవించింది. తృటిలో ఈ పేలుడు నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి కనిపించకుండా ఉన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada
  • Hardeep Singh Nijjar
  • Khalistan
  • Pakistan
  • Shahid Latif

తాజావార్తలు

  • Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

  • Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్

  • Diamond Dacoit Challenge: హుక్ స్టెప్‌ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!

  • Iran: ట్రంప్ వార్నింగ్‌కు స్ట్రాంగ్ ఇరాన్ కౌంటర్.. అమెరికాకు ఇదే చివరి హెచ్చరిక అంటూ..

  • Chicken Price Hike: నాన్‌వెజ్ ప్రియులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions