Pakistan: మరో ఉగ్రవాది ఖతం.. అల్ బదర్ ఉగ్రసంస్థ కాశ్మీర్ మాజీ కమాండర్ హత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Al Badr Terrorist shot dead in Pakistan: భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతం అవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలంను ఇటీవల పాకిస్తాన్ రావల్పిండి నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాక్ లో కాల్చిచంపారు. ఇదిలా ఉంటే ఆదివారం మరో ఉగ్రవాది ఇలాగే హతమయ్యాడు. పాక్ ఉగ్రవాద సంస్థ అల్ బదర్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలోని గులిస్తాన్ ఏ జోహర్ బ్లాక్ 7 ప్రాంతంలోని అతని నివాసంలో కాల్చి చంపారు.
Read Also: Chiranjeevi: బ్రేకింగ్.. చిరంజీవి సినిమా సెట్ లో అగ్నిప్రమాదం
Also Read
- US-Iran War: పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ఒప్పందం ముగిసినట్లే? ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం!
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
- Lashkar-e-Taiba: ఇజ్రాయెల్తో సంబంధం పెట్టుకుంటే చంపేస్తాం.. షరీఫ్, మునీర్కు లష్కరే వార్నింగ్
- US-Hormuz: హార్ముజ్పై అమెరికా-ఇరాన్ గుడ్న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
1990వ దశకంలో 8 ఏళ్ల పాటు సయ్యద్ ఖలీద్ రజా జమ్మూ కాశ్మీర్ అల్ బదర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ గా వ్యవహరించారు. జమాత్ ఇ ఇస్లామీ అధ్యక్షుడు కరాచీ ప్రకారం.. మరణించిన వ్యక్తి కూడా జేఐ తల్బా వింగ్ తో సంబంధం కలిగి ఉన్నాడు. జమ్మూకాశ్మీర్ ను భారత్ నుంచి విడదీసి పాకిస్తాన్ లో కలిపే ఉద్దేశంతో ఈ అల్ బదర్ ఉగ్రసంస్థ 1998లో ఏర్పాటైంది. కొంత కాలం హిజ్బుల్ ముజాహిదీన్ తో కలిసి పనిచేసింది. ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలు మరియు పౌరులపై కూడా దాడి చేసింది. 2002లో జమ్మూ ప్రాంతంలో ఈ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో ముగ్గురు కాశ్మీరీ మహిళలు చనిపోయారు.
2003లో పాకిస్తాన్-భారత్ మధ్య చర్చలను తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చలను ఆశ్రయించే బదులు భారత్ పై జీహాద్ చేయాలని పేర్కొంది. ఈ ఉగ్రసంస్థకు జమాతే ఇస్లామ్, ఐఎస్ఐ చాలా కాలం వరకు నిధులను అందించి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాయి. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు మద్దతుగా పోరాడింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా తరువాత కాశ్మీర్ లో ఆత్మాహుతికి పాల్పడిన సంస్థగా అల్ బదర్ కు పేరుంది. ప్రస్తుతం దీనికి భక్త్ జమీన్ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. లడఖ్ ను అనుకుని ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ లోని స్కర్దు కేంద్రంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..