Mike Pompeo: బాలాకోట్ దాడుల తర్వాత భారత్ పై అణుదాడికి సిద్ధమైన పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex US Secretary Of State On India-Pak Nuke Threat After Balakot: బాలాకోట్ దాడుల అనంతర పాకిస్తాన్, భారత్ పై అణుదాడికి సిద్ధం అయిందని వెల్లడించారు అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఈ విషయాన్ని అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా నాలో చెప్పారని.. ఆ సమయంలో నేను వియత్నాంలోని హనోయ్ లో ఉన్నానని.. అణుదాడికి ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం అవుతుందనే మాటతోనే నేను నిద్ర లేచానని వెల్లడించారు. తాజాగా ఆయన రచించిన ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’’ పుస్తకంలో వెల్లడించారు. 2019 ఫిబ్రవి 27-28 తేదీల్లో యూఎస్-నార్త్ కొరియా సమ్మిట్ కోసం హనోయ్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు గుర్తు చేసుకున్నారు.
Read Also: Pakistan: అంధకారంలో పాకిస్థాన్.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం
Also Read
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
భారత్-పాక్ అణు యుద్ధానికి ఎంత దగ్గరగా వచ్చాయనే విషయం ప్రపంచానికి సరిగ్గా తెలియదని.. పరిస్థితిని చక్కదిద్దడానికి సుష్మా స్వరాజ్ ను నాకు ఒక నిమిషం సమయం ఇవ్వాలని అడిగానని.. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వాతో మాట్లాడనని, అయితే తాము ఎలాంటి అణుయుద్ధానికి దిగడం లేదని, భారత్ మాపై అణు దాడి చేయాలని అనుకుంటోందని ఆరోపించారని.. అయితే భారత్ అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదని చెప్పానని అన్నారు. ఆ రోజు మేం చేసిన పనిని మరే దేశం చేసి ఉందడని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లోని మా బృందాలు అద్భుతంగా పనిచేశాయని ఆయన అన్నారు.
2019లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణం అయ్యారు ఉగ్రవాదులు. ఆ సమయంలో భారత యుద్ధవిమానాలు పాకిస్తాన్ బాలకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఇదే సమయంలో మన పైలెట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ బైసన్ యుద్దవిమానంతో అత్యంత ఆధునాతనమైన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాడు. ఆ తరువాత ఆయన విమానం కూలి పాకిస్తాన్ సైన్యానికి చిక్కాడు. ఆ తరువాత అంతర్జాతీయ ఒత్తిడితో పాక్ దిగివచ్చి అభినందన్ వర్థమాన్ ను భారత్ కు అప్పగించింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!