Qamar Javed Bajwa: పాకిస్తాన్ ఆర్మీకి అంత సీన్ లేదు.. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-Pak Army Chief General Bajwa Said Pak Military Was No Match for Indian Army: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బజ్వా తన సొంత సైన్యంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ సైన్యంతో పోరాడే శక్తి, సామర్థ్యాలు పాక్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ఆ స్థాయి ఆయుధ సంపత్తి సైతం పాక్ ఆర్మీ వద్ద లేదని బాంబ్ పేల్చారు. బ్రిటన్లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
GT vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్
Also Read
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
జావెద్ మాట్లాడుతూ.. ‘‘ఇండియన్ ఆర్మీకి పాక్ ఆర్మీ ఏమాత్రం సరితూగలేదు. భారత్తో యుద్ధానికి దిగే పరిస్థితి పాక్కి లేదు. ట్యాంకులు ఏమాత్రం పని చేయడం లేదు. ఫిరంగులను తరలించేందుకు డీజిల్ సైతం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. పాక్ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులో జావెద్ బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు.. జర్నలిస్ట్ హమీద్ మీర్ వెల్లడించాడు. అంతేకాదు.. పాకిస్తాన్ వద్ద పెద్దగా ఆప్షన్స్ లేవు కాబట్టి భారత్తో శతృత్వం పెంచుకోవడం కన్నా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరచుకుంటేనే ఉత్తమమని జావెద్ అభిప్రాయపడినట్టు మీర్ తెలిపాడు. భారత్తో ఉన్న సుదీర్ఘ విరోధం పాక్ దేశాన్ని హరించేస్తోందని.. భారత్తో పోరాడేందుకు కావాల్సిన ఆయుధ సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్కు వద్ద లేవు కాబట్టి, కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై సమాలోచనలు జరుగుతున్నాయని బజ్వా పేర్కొన్నట్టు చెప్పాడు.
Dubai Sand Plot: రికార్డ్ ధరకి ఇసుక ప్లాట్.. ఓనర్కి 242% లాభం
కాగా.. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో.. అక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో.. సరైన తిండి లేక విలవిలలాడుతున్నారు. ఉద్యోగాలు కూడా ఊడి.. అనేకమంది ఆకలితో అలమటిస్తున్నారు. జీతాల్లో కోతలు సైతం విధించారు. పంజాబ్ ప్రావిన్స్లో ఎన్నికలపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఘర్షణ పడటంతో.. పాకిస్తాన్ రాజకీయ పరిస్థితి పెళుసుగా తయారైంది. ఈ సమస్యలు చాలవన్నట్టు.. తెహ్రీక్-ఏ-తాలిబన్ నుంచి ఆ దేశం దాడుల్ని ఎదుర్కుంటోంది. వాయువ్య పాకిస్తాన్లో భద్రతా సిబ్బందిపై తాలిబన్లు దాడి చేయడంతో.. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
-
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!