Donald Trump: అమెరికన్లకు గుడ్న్యూస్ చెప్పిన ట్రంప్.. త్వరలోనే ట్యాక్స్ మాఫీ
- అమెరికన్ పౌరులకు ఆదాయపన్ను లేకుండా చూస్తాం..
- అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను సృష్టిస్తాం..
- ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేస్తే వచ్చే నష్టాన్ని ఇతర దేశాలపై పన్నులు వేసి పూడ్చుకోవాలి..
- భారత్, చైనా సహా పలు దేశ ఉత్పత్తులపై పన్నులు పెంచనున్న డొనాల్డ్ ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: యూఎస్ పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచడానికే ఈ దిశగా తాము అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. యూఎస్ పౌరులను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా.. ఇవి ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు. అయితే, అమెరికా ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే.. దాన్ని చేసుకోవడానికి దిగుమతి సుంకాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం.
Read Also: Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. వీటిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలు..!
Also Read
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
- Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
- PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
ఇక, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్లను ధనవంతులుగా మార్చే వ్యవస్థలోకి మనం వెళుతున్నామని వెల్లడించారు. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై ట్యాక్సులు చేయడం కంటే.. మనమే విదేశాలపై పన్నులు వేయడంతో యూఎస్ ప్రజలను సంపన్నులు చేయొచ్చని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసును స్టార్ట్ చేసినట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదను కలిగి ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
Read Also: DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..
అయితే, భారత్, చైనా, బ్రెజిల్పై అత్యధిక ట్యాక్సులు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇతర దేశాలు కూడా ఏం చేస్తున్నాయో మనం చూడొచ్చు అన్నారు. చైనా భారీగా సుంకాలు వసూలు చేస్తుండగా.. భారత్, బ్రెజిల్ సహా ఇతర దేశాలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ, మనకు అమెరికా ప్రయోజనాలే అన్నింటికంటే ముందుండాలన్నారు. గత డిసెంబర్లోనే బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించాడు. యూఎస్ డాలర్ వినియోగం నిలిపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!