Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
- PoKలో పోరాడుతున్న వారిపై రాణా సనావుల్లా కీలక వ్యాఖ్యలు.
- ఒకప్పుడు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులే అని అంగీకారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో(PoK)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై దమనకాండకు తెగబడుతోంది. ఉద్యమకారులపై పాక్ సైన్యం కాల్పులు జరపడంతో తాజాగా 20 మందికి పైగా మరణించారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో పాక్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు, ఆక్రమిత భూభాగంలో పాకిస్తాన్ ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. పీఓకే ప్రజలు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఉగ్రవాదంపై మరోసారి ఒప్పుకుంటూ వ్యాఖ్యలు చేసింది. తాము పెంచి పోషించిన పామే ఇప్పుడు తమను కాటేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా ఒప్పుకున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి ముజాహిదీన్లుగా పంపిన వ్యక్తులే ఇప్పుడు తమకు పెద్ద సమస్యగా మారారని అన్నారు. “ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పోరాడుతున్న వారిలో చాలామంది గతంలో మనం ముజాహిదీన్లుగా శిక్షణ ఇచ్చి పంపినవారే. అప్పటి నుంచి వారు మనపై పగ పెంచుకున్నారు” అని అన్నారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని అన్నారు. వారికి రాజకీయ లక్ష్యాలు, ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి లేదని, సాధారణ ప్రజల్ని ఉపయోగించుకుని పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!