Modi-Trump: అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.. భారత వాణిజ్య శాఖ వెల్లడి
- అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి
- వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం తెలిపారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అగర్వాల్ ముఖ్య సంధానకర్తగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపారు. త్వరలోనే ఒక కొలిక్కి అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ట్రంప్ విధించిన డెడ్లైన్ గడువు జూలై 9తో ముగిసిపోయింది. అయితే కొన్ని దేశాలకు ఆగస్టు 1 వరకు గడువు పొడిగించారు. అయితే అమెరికా.. భారత్లో వ్యవసాయం, పాడి పరిశ్రమపై మినహాయింపులు కోరుతోంది. ఈ రెండు కూడా భారతదేశంలో చాలా సెంటిమెంట్. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సందిగ్ధంలో పడ్డాయి.
ఇది కూడా చదవండి: Drugs Racket Busted: మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ‘ఈగల్ టీం’ దూకుడు.. 9 పబ్స్పై కేసు నమోదు!
Also Read
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
తాజాగా ఇదే అంశంపై గురువారం రాజేష్ అగర్వాల్ స్పందించారు. ఎగుమతి లాజిస్టిక్స్పై జరిగిన కార్యక్రమంలో అగర్వాల్ వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ఒప్పందం యొక్క మొదటి దశను సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ముగించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశం ఇప్పటి వరకు 26 దేశాలతో 14కి పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అమలు చేసిందని అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం ప్రధాన మార్కెట్లతో అనుసంధానం అవుతున్నామని.. ఇప్పటికే యూకేతో ఒక ఒప్పందాన్ని ముగించినట్లు పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్తో కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లు.. చట్టసభలన్నింటికీ రిజర్వేషన్ వర్తిస్తుందా?
ఇక భారతదేశం.. చిలీ, పెరూ వంటి లాటిన్ అమెరికన్ దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా, యూఏఈలతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని.. న్యూజిలాండ్తో కూడా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఏప్రిల 2న ట్రంప్.. ఆయా దేశాలపై సుంకాలు విధించారు. అయితే ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఈ నిర్ణయాన్ని మూడు నెలల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆ డెడ్లైన్ మొన్న జూలై 9తో ముగిసింది. ఈ మేరకు ఆయా దేశాలను హెచ్చరిస్తూ లేఖలు కూడా రాశారు. ఇక రెండు మిత్ర దేశాలకు ఇప్పటికే సుంకాలు విధించారు. మిగతా దేశాలకు ఆగస్టు 1 వరకు గడువు విధించారు. ఈలోపు అమెరికాతో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అమెరితో యూకే, వియత్నాం మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి. చైనా మాత్రం పరస్పరం తాత్కాలింగా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!