Joe Biden: ప్రపంచ నాయకులతో జో బైడెన్ అత్యవసర సమావేశం.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది. పోలాండ్ లో మిస్సైల్ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు.
Read Also: Dog Attack: కుక్క దాడికి గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
నాటోలో సభ్యదేశం అయిన పోలాండ్ పై మిస్సైల్ పడటంతో నాటో దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై జీ-20 సమావేశంలో పాల్గొన్న బైడెన్, ప్రపంచ నేతలతో అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం బాలిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నట్లు అమెరికా వెల్లడించింది. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాటో, జీ-7 దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అమెరికా వెల్లడించింది.
రష్యా చర్యను నాటో సభ్యదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోలాండ్ లో రష్యా మిస్సైల్ పడిపోవడంపై అమెరికా, దాని మిత్రదేశాలు విచారణ సాగిస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంపై ఆహార, ఇంధన సంక్షోభ ప్రభావం పడుతోంది. జీ-20 దేశాల తర్వాతి సమావేశం భారతదేశంలో జరగబోతున్నాయి. 2023కి గానూ భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!